తిరుపతి: కోట్లాదిమంది భక్తుల ఆరాధ్య దైవం ఏడుకొండల వేంకటేశ్వరస్వామి నిలయమైన తిరుమల క్షేత్ర పవిత్రతను కాపాడేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. తిరుమల పవిత్రతకే ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని చెప్పారు. తిరుమల లడ్డూలకు కల్తీ నెయ్యి ఘటనపై వైసీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా ఒక జీఓ తీసుకువచ్చారని, దాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించడంతో వెనక్కి తీసుకున్నారని గుర్తుచేశారు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి అపవిత్రం జరిగితే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.
Read also: Nitin Gadkari: విజయవాడ బైపాస్లో అక్కడి వరకు వాహనాలకు పర్మిషన్..

The coalition government is committed to preserving the sanctity of Tirumala.
తిరుపతి జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ అధ్యక్షతన ఆయన బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తైన సందర్భంగా ఆదివారం ఉదయం తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో “బీజేపీ కమలవికాసం” సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. విశిష్ట అతిథులుగా బీజేపీ రాష్ట్ర కమిటీ నాయకులు దయాకర్ రెడ్డి, నాగోతు రమేష్ నాయుడు, కోలా ఆనంద్, అశోక్ రాజు, పంతుల సురేష్, నిషిధరాజు, భాను ప్రకాశ్ రెడ్డి, జల్లి మధుసూదన్, వరప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతంపై నాయకులు ప్రసంగించారు.
కష్టపడి పనిచేసిన వారిని గుర్తించి పదవులు ఇవ్వాలని
కూటమిలో బీజేపీ లేకపోతే రాష్ట్రంలో టీడీపీ, జనసేన ఉండేవి కాదని బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమిలో బీజేపీయే ప్రధానమని, ఆ తర్వాతే టీడీపీ, జనసేన పార్టీలని స్పష్టంగా చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ నాయకులకు తగిన అవకాశాలు కల్పించాలని సూచించారు. కూటమిలో అన్ని పార్టీలకు సముచిత గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్టీ కోసం, ప్రభుత్వ కోసం కష్టపడి పనిచేసిన వారిని గుర్తించి పదవులు ఇవ్వాలని, అన్ని కులాలకు న్యాయం జరగాలని ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారి తీశాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: