Tirupati: దేశ రక్షణలో మాజీ సైనికుల సేవలు వెలకట్టలేనివి – తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి
- తిరుపతి నగరంలో మాజీ సైనికుల కార్యాలయంలో తిరుపతి ఈఎస్ఎం (ESM) మరియు వెటరన్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి.
- ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తిరుపతి తెదేపా పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి హాజరై,దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు.
- ఈ సందర్భంగా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ, “సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడే సైనికుల వల్లే మనం ప్రశాంతంగా ఉన్నామని కొనియాడారు.
Read Also: Sikkim Border: 16,000 అడుగుల ఎత్తులో భారత సైనికుల గణతంత్ర వేడుకలు

- సరిహద్దుల్లో ఎముకలు కొరికే చలిలో, ప్రాణాలకు తెగించి మీరు చేసిన పోరాటం వల్లే నేడు దేశం సురక్షితంగా ఉంది. పదవీ విరమణ చేసినా మీలో ఉన్న క్రమశిక్షణ, దేశభక్తి నేటి తరానికి ఎంతో అవసరమని తెలిపారు.
- మాజీ సైనికులు సమాజ శ్రేయస్సు, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
- నేటి యువత మాజీ సైనికులను స్ఫూర్తిగా తీసుకుని దేశభక్తిని పెంపొందించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
- రిటైర్ అయిన తర్వాత కూడా సమాజం పట్ల మాజీ సైనికులు చూపుతున్న బాధ్యత అభినందనీయం. వీరి క్రమశిక్షణ, అంకితభావం ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం.”
- వెటరన్స్ ఆర్గనైజేషన్ అభివృద్ధికి లేదా ఇతర అవసరాలకు సంబంధించి ప్రతిపాదనలు అందజేస్తే, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
- మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి, వారి సంక్షేమానికి తాను తుడా చైర్మన్ గా, డాలర్స్ దివాకర్ రెడ్డి గా పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
- ఆర్గనైజేషన్ సభ్యులు మాట్లాడుతూ “తుడా చైర్మన్ గా డాలర్స్ దివాకర్ రెడ్డి తుడా ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని,మరిన్ని పదవులను అధిరోహించి ఉన్నత స్థాయిలో ఉండాలని ఆశీర్వదించారు.”
- అనంతరం పలువురు మాజీ సైనికులు డాలర్స్ దివాకర్ రెడ్డి కి తమ ఆర్గనైజేషన్ తరుపున క్యాప్ తో గౌరవంగా బహుకరించారు.
- ఈ వేడుకల్లో తిరుపతి ఈఎస్ఎం మరియు వెటరన్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు, పెద్ద సంఖ్యలో మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: