हिन्दी | Epaper

Tirupati: యువ పార్లమెంట్ పోటీల్లో పద్మావతి వర్సిటీ విద్యార్థినుల విజయం

Saritha
Tirupati: యువ పార్లమెంట్ పోటీల్లో పద్మావతి వర్సిటీ విద్యార్థినుల విజయం

పద్మావతి వర్సిటీ విద్యార్థినులు

Tirupati: ‘వికసిత్ భారత్ యువ పార్లమెంట్-2026’ అంశంపై జిల్లా స్థాయి వక్తృత్వ పోటీలకు తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం లో ముగ్గురు విద్యార్థినులు ఎంపికయ్యారు. ‘భారత ప్రజాస్వామ్యానికి 50 సంవత్సరాల ఎమర్జెన్సీ తీసుకోవాల్సిన పాఠాలు’ అనే అంశాన్ని ప్రధానంగా తీసుకున్నారు. తిరుపతిలోని ఎమరాల్డ్స్ డిగ్రీ కళాశాలలో మై భారత్ చిత్తూరు జిల్లా ఆధ్వర్యంలో -నిర్వహించడింది.

AP Politics: కేంద్ర కేబినెట్‌లోకి జనసేన? ఏపీలోనూ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం!

Tirupati: యువ పార్లమెంట్ పోటీల్లో పద్మావతి వర్సిటీ విద్యార్థినుల విజయం
Tirupati Padmavati: University students win in the Youth Parliament competition

వర్సిటీ అధికారుల అభినందనలు

ఈ పోటీలలో పద్మావతి మహిళ విశ్వవిద్యాలయం నుండి పి. వెంకటనాగ నిహారిక -ద్వితీయ సంవత్సరం ఇంటిగ్రేటెడ్ ఫుడ్ టెక్నాలజీ, హోమ్ సైన్స్ విభాగం. ఎం. అమీన జైనబ్ -విద్యార్థిని, న్యాయ విభాగం. కె. అనఘ -ప్రథమ సంవత్సరం ఎల్ఎల్బి, న్యాయ విభాగం నుండి పాల్గొన్న ముగ్గురు విద్యార్థినులు ఎంపిక కావడం విశేషం. ఈ విజయాన్ని సాధించిన విద్యార్థినులకు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఉమ వెన్నం, రిజిస్ట్రార్ ఆచార్య ఉష, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఆచార్య ఐ.వి. లలిత కుమారి అభినందనలు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870