Helmet Rule: తిరుపతి(Tirupati), చిత్తూరు జిల్లాల వ్యాప్తంగా రోడ్డు భద్రతపై పోలీసులు ప్రత్యేక ఫోకల్చేశారు. ఇప్పటి వరకు అటూఇటూ ఉదార ఉదారతతో వ్యవహరించిన పోలీసులు ఇప్పుడు కొరఢా ఝుళిపించనున్నారు. ఈ రెండు జిల్లాల్లో ద్విచక్ర వాహనాలు నడిపే వ్యక్తులు హెల్మెట్ ధరించకుంటే నేటి నుండి పెట్రోల్ పట్టరని తిరుపతి జిల్లా ఎస్పీ లంకెల సుబ్బారాయుడు స్పష్టం చేశారు. ఆదివారం హెల్మెట్ఫారణపై అవగాహన ర్యాలీ తిరుపతిలో చేపట్టారు.
Read also: AP: స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ

పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు నిబంధనలు
దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల(Road accidents)లో సుమారు 45 మరణాలు ద్విచక్ర వాహనదారుల మితిమీరిన వేగం మరియు హెల్మెట్ లేకుండా ప్రయాణం వల్ల జరుగుచున్నవని గణాంకాలు తెలియజేస్తున్నాయి. 40 మరణాలు హెల్మెట్ వాడకం వల్ల తగ్గే అవకాశం ఉన్నట్లు జాతీయ గణాంకాలు సూచిస్తున్నాయి. సరియైన రోడ్డు భద్రతా నియమాలు పాటించకపోతే కుటుంబంలో ఒకరు మరణిస్తే కుటుంబం చిన్నాభిన్నం అవుతుంది.
రోడ్డు భద్రతే లక్ష్యం: పోలీసుల కఠిన నిర్ణయం
ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా ఎస్పీ లంకెల సుబ్బారాయుడు, చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాలతో నేటి నుండి ద్విచక్ర వాహనదారులకు నో హెల్మెట్ నో పెట్రోల్ నిబంధనలను అమలు చేసేలా పెట్రోల్ బంకుల యజమానులకు ఆదేశాలిచ్చారు. ప్రజలకు, విద్యావంతులైన ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, యువత మరియు అందరూ ద్విచక్ర వాహనదారులు అనగా వాహనం నడుపుతున్న వారు, వెనుక కూర్చొని వున్నవారు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: