हिन्दी | Epaper

Tirupati Crime : మహిళను హత్య చేసి ఆపై ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి

Tejaswini Y
Tirupati Crime : మహిళను హత్య చేసి ఆపై ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి

తిరుపతి(ప్రభాతవార్త ప్రతినిధి): తిరుపతి నగరంలో మంగళవారం ఉదయం దారుణ సంఘటన జరిగింది. మహిళను హత్య చేసి ఆపై ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి . తిరుపతి(Tirupati) కొర్లకుంట మారుతీ నగర్ లో ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం తోనే మహిళను హత్య చేసి ఆపై ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి.

Read also: Bengaluru Crime: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మహిళా టెకీ మృతి

Tirupati
Tirupati: Man kills woman and then commits suicide

వివరాల్లోకి వెళితే..

తిరుపతి జీవకోనకు చెందిన సాంబలక్ష్మి (40) తో సోమశేఖర్ అనే వ్యక్తి వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడు. ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ తో ఉదయం సాంబలక్ష్మిని హత్య(murder) చేసి అనంతరం సోమశేఖర్(37) కూడా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకునాడు.

గుత్తి వారి పల్లికి చెందిన సోమశేఖర్ ఐదు సంవత్సరాలుగా కొర్లగుంట మారుతి నగర్ లో ఉంటూ ఓ గ్యాస్ ఏజెన్సీలో విధులు నిర్వహిస్తున్నాడు. ఆమెతో వివాహేతర సంబధం బెడిసి కొట్టదంతో ఈ ధారణ సంఘటన. విషయం తెలుసుకున్న ఈస్ట్ డిఎస్పి భక్తవత్సలం, సీఐ శ్రీనివాసులు, ఎస్సై స్వాతి బృందం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను రుయా మార్చురీకి తరలించారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870