हिन्दी | Epaper
10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్

Tirupati District: రంగంపేటలో అంబరాన్నంటిన జల్లికట్టు సంబరాలు

Rajitha
Tirupati District: రంగంపేటలో అంబరాన్నంటిన జల్లికట్టు సంబరాలు

చంద్రగిరి : పట్టీల కోసం పోటెత్తిన ఆ పల్లె జనంతో ఆరేపల్లి రంగంపేట కిటకిటలాడింది. ఆరేపల్లి రంగంపేటలో కనుమ రోజున జరుపుకునే జల్లికట్టు సంబరాలను అనివార్య కారణలతో వాయిదా వేశారు. ఇందులో భాగంగా బుధవారం తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం, ఆరేపల్లి రంగంపేటలో జల్లికట్టు సంబరాలు అయిబరాన్నంటేలా నిర్వహించారు. పాడి రైతు ఎద్దుకు కట్టిన చెక్క పట్టీని ఒడిసి పట్టుకోవడం కోసం పోటెత్తిన పౌరుషంతో యువత పోరాటమే చేసింది. జల్లికట్టు సంబరాలకు వందలాది పాడి ఆవులను, ఎద్దులను ముస్తాబు చేశారు. ఏరువాకలో తమకు చేదోడుగా నిలిచి వండిన వంటలను ఇంటికి చేర్చే కాడెద్దులకు రైతులు పూజలు జరిపించి వాటిలోని ఉత్సాహాన్ని, పౌరుషాన్ని వెలికితీయడమే లక్ష్యంగా జల్లికట్టు సంబరాలు నిర్వహిస్తారు.

Read also: Chittoor: సీఎం చంద్రబాబు నగరి పర్యటన ఏర్పాట్ల పరిశీలన

Jallikattu celebrations

Jallikattu celebrations

ఈ క్రమంలో ఒక చెక్కతో అందంగా మలచబడిన పట్టీని పాడిరైతు తన ఎద్దు కొమ్ములకు కట్టి జనంలోకి వదలిపెడతాడు. తన ఎద్దు కొమ్ములకు కట్టిన పట్టీని గెలుచుకున్న యువత పౌరుషానికి ప్రతీకగా భావిస్తారు. జల్లికట్టు సంబరాలలో తమ పౌరుషాన్ని ధీటుగా ప్రదర్శించేందుకు యువత సైతం రెట్టించిన ఉత్సాహంతో పోటెత్తిన పోట్లగితలను నిలువరించి పట్టీని సొంతంచేసుకునేందుకే బరితెగించి యుద్ధమే చేశారు. ఈ సాహస కృత్యంలో పలువురు పల్టీలు కొట్టి గాయాలపాలయ్యారు.

Jallikattu celebrations

ఈ జల్లికట్టు సంబరాలను తిలకించేందుకు ఉష్ణుడి చిత్తూరు జిల్లాతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి వేలాది మంది చేరుకోవడంతో ఏ.రంగంపేట జనసంద్రమయ్యింది. జల్లికట్టు సంబరాలకు ప్రత్యేక స్థానం కలిగివుండటంతో సంబరాలకు ప్రారంభానికి ముందు చంద్రగిరి ఎంఎల్ఎ వులివర్తి నాని సందడి చేశారు. ఎంఎల్ఎ రాకతో పార్టీ నాయకులు, అభిమానులు అపూర్వ స్వాగతం! పలుకుతూ హోరెత్తిన కేరింతల నడుమ తమ అభిమాన నాయకుడిని భుజాలకెత్తుకుని మోసుకుంటూ గ్రామవీధులలో ఊరేగించారు. ప్రత్యేక పూజల అనంతరం జల్లికట్టు సంబరాలను అట్టహాసంగా ప్రారంభించారు.

Jallikattu celebrations

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870