రథ సప్తమి సందర్భంగా తిరుమల(Tirumala) తిరుపతి దేవస్థానం(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి తిరుపతిలో మూడు రోజుల పాటు సర్వ దర్శన టోకెన్ల జారీని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ టోకెన్లు జారీచేసే మూడు ప్రాంతాల్లోనూ నిలిపివేయాలని నిర్ణయించినట్లు టీటీడీ ప్రకటించింది. రథ సప్తమి నేపథ్యంలో ఉన్నతాధికారులతో టీటీడీ ఈవో ఇటీవల సమీక్షా సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.
భద్రత, పార్కింగ్, అన్నప్రసాదాలు, లడ్డూలు, రద్దీ నిర్వహణ, స్వచ్ఛ కార్యక్రమాలు, అత్యవసర సేవల విషయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని వారికి ఆయన సూచించారు. రథసప్తమి వేడుకల సందర్భంగా స్వామివారి ప్రత్యేక సేవలు, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవాలు, సహస్ర దీపకలంకారాలు రద్దు చేశారు. ఎన్ఆర్ఐలు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల ప్రివిలేజ్ దర్శనాలు నిలిపివేయబడ్డాయి. VIP బ్రేక్ దర్శనాలు మినహా, జనవరి 24న అన్ని సిఫార్సులు స్వీకరించబోమని టీటీడీ తెలిపారు.
Read also: AP: నగరి నియోజకవర్గంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు

ఏఏ సేవలు..ఎప్పుడెప్పుడంటే?
తెల్లవారుజామున 5:30 నుంచి 8:00 గంటల వరకు సూర్యప్రభ వాహనం
ఉదయం 9:00 నుంచి 10:00 గంటల వరకు చిన్నశేష వాహనం
ఉదయం 11:00 నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు గరుడ వాహనం
మధ్యాహ్నం 1:00 నుంచి 2:00 గంటల వరకు హనుమంత వాహనం
మధ్యాహ్నం 2:00 నుంచి 3:00 గంటల వరకు చక్రస్నానం
సాయంత్రం 4:00 నుంచి 5:00 గంటల వరకు కల్పవృక్ష వాహనం
సాయంత్రం 6:00 నుంచి 7:00 గంటల వరకు సర్వభూపాల వాహనం
రాత్రి 8:00 నుంచి 9:00 గంటల వరకు చంద్రప్రభ వాహనం
ఏప్రిల్ నెలకు సంబంధించి ఈరోజు (Tirumala) ఆన్లైన్లో శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేసేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఉదయం 10:00 గంటలకు ఆర్జిత సేవ, మధ్యాహ్నం 3:00 గంటలకు వర్చువల్ సేవా టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: