విద్యుద్దీపకాంతులతో తేజోమయమైన కలియుగవైకుంఠం
తిరుమల: తిరుమలదివ్యక్షేత్రంలో భక్తులు తొలి దర్శనం, తొలిపూజ, తొలి నైవేద్యం ఆదివరాహస్వామికే సమర్పిస్తారని నియమంతో శ్రీవేంకటేశ్వరస్వామి ఒప్పందం దానపత్రం రాసిచ్చాడు. వరాహస్వామి(Varahaswamy)ని తొలుత దర్శిస్తేనే శ్రీవేంకటేశ్వరుడు సంతోషిస్తాడు. క్షేత్ర సాంప్రదాయం ప్రకారం శ్రీవరాహస్వామిని దర్శించు కున్న తరువాతనే శ్రీనివాసుని దర్శించుకోవడం సంప్రదాయం.

ఒక్కోకొండకు ఒక్కో ప్రత్యేకత
శ్రీమహావిష్ణువు వైకుంఠం వదలి కలియుగంలో వేంకటాచలం(Venkatachalam)పై శ్రీవేంకటేశ్వరునిగా ఆవిర్భవించిన సమయం లో శేషాచలంకొండల్లోని సప్తగిరులపై తన నివాసముంటే అన్నింటా శుభకరమని భావించాడు. తిరుమల గిరులు ఏడుకొండలకు ప్రతీతి. ఈ కొండలకు గరుడపురాణంలో ఒక్కోకొండకు ఒక్కో ప్రత్యేకత ఉంది. అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకునే భక్తులు ఎంతో పవిత్రంగా, భక్తిభావంతో కొండలెక్కి వస్తారు. వృషాద్రి, వృషభాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, శేషాద్రి, వేంకటాద్రి, నారయణాద్రి. ఏడు చక్రాలు దాటితే ఆనందానుభూతి కలుగుతుంది. శక్తిస్థానాలుగా ఉన్న ఏడుకొండలు ఎక్కడం కూడా ఒకరహస్యం శ్రీమహావిష్ణువు కొలువుండే వైకుంఠానికి ఏవిధంగా జయవిజయులు కాపలాగా ఉంటారో అలాగే కలియుగవైకుంఠం తిరుమలలో ఆనందనిలయంలో బంగారువాకిలికి దక్షిణాన జయుడు, ఉత్తరాన విజయుడు శంఖుచక్ర గధాదారులై సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపంలా దర్శనమిస్తుంటారు.
వీరిని’చండప్రచండులు”అని కూడా వ్యవహరిస్తారు. పది అడుగుల ఎత్తుతో గంభీరంగా ఉండే ఈ పంచలోహ విగ్రహాలు తర్జనితో భక్తులను ఎల్లవేళలా హెచ్చరి స్తుంటాయి. స్వామివారి పుష్కరిణిలో పవిత్ర స్నాన మాచరించి, శుచిగా ఆలయంలోనికి ప్ర శించి ఆలయ నిబంధనలు పాటిస్తూ క్రమశిక్షణతో మెలగుతూ తోటి భక్తులకు ఇబ్బంది కలగకుండా స్వామివారి దర్శనం చేసుకోవాలి.