తొలిసారి ఏపీలో ‘కొకైన్’ కలకలం

Read Time:  1 min
Three arrested and 8.5 gram
Three arrested and 8.5 gram
FONT SIZE
GET APP

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గంజాయి తో తదితర వంటిమాదక ద్రవ్యాలు పెద్దగా కనిపిస్తున్నా, కొకైన్ వంటి అత్యంత ప్రమాదకరమైన మాదక ద్రవ్యం మాత్రం ఇంతవరకు కనిపించలేదు. అయితే గుంటూరులో తొలిసారి కొకైన్ కలకలం రేపింది. ఎక్సైజ్ పోలీసులు తాజాగా ముగ్గురు యువకుల నుంచి 8.5 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేశారు. ఇది రాష్ట్రంలోనే తొలి కొకైన్ కేసు కావడంతో పోలీసులు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టారు.

కొకైన్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రమాదకరమైన మాదక ద్రవ్యం. దాని వినియోగం శరీరానికి చాలా హానికరం. అలాంటి ప్రమాదకర ద్రవ్యం గుంటూరులోని ముగ్గురు యువకులు వినియోగించేందుకు తీసుకెళ్ళి దొరికారు. ఈ ద్రవ్యం ఒక గ్రాము కొకైన్లను రూ. 3,000 నుండి రూ.6,000 మధ్య విక్రయిస్తున్నట్లు తేలింది. దీంతో ట్రాఫికింగ్ మీద కూడా పోలీసులు మరింత దృష్టి పెడుతున్నారు. ఈ పరిస్థితి విస్తృతంగా కంట్రోల్ చేయకపోతే, కొకైన్ వంటి మాదక ద్రవ్యాలు నగరాల్లో పెరిగే అవకాశాలు ఉన్నాయి. పోలీసులు ప్రజలకు ఈ రకమైన ద్రవ్యాల వినియోగం మరియు రవాణా గురించి సమాచారాన్ని అందించాలని పిలుపునిచ్చారు.

దీనిపై ఎక్సైజ్ అధికారులు స్పందిస్తూ.. “ప్రజల సాయం వలననే మాదక ద్రవ్యాలు సరఫరా చేసే నెట్‌వర్క్స్ తొలగించగలుగుతాము. మీరు ఇచ్చే సమాచారాన్ని కూడా గోప్యంగా ఉంచుతాం” అని తెలిపారు. ప్రజలంతా ఈ విషయాన్ని అర్ధం చేసుకొని, మాదక ద్రవ్యాల వ్యాప్తిని అరికట్టడంలో సహాయపడాలని వారు కోరారు.

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.