విశాఖపట్నంలో టీడీపీ (TDP in Visakhapatnam) కార్యకర్తల సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలే పార్టీకి ప్రాణమని, వారు ఉన్నంత వరకు పార్టీ ఓడిపోదని ఆయన స్పష్టం చేశారు. కార్యకర్తలు అలిగినా కాడి వదిలేస్తారే కానీ వేరే పార్టీలోకి వెళ్లరని ధీమా వ్యక్తం చేశారు.తెలుగుదేశం కార్యకర్తలు బాధపడే పరిస్థితిని ఇకనుండి రానివ్వనని చంద్రబాబు హామీ ఇచ్చారు. కార్యకర్తల అనుభవాలు, కష్టాలు వృథా కాకుండా చూస్తామని తెలిపారు. పార్టీ జెండాను ఎత్తి పెట్టి, నిస్వార్థంగా పని చేసిన వారు ఇక నుంచి మరింత ఆదరణ పొందుతారని స్పష్టం చేశారు.
కార్యకర్తలకే అధిక ప్రాధాన్యత
తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే నాయకులు అన్న భావన కొనసాగుతుందన్నారు. ఇకనుంచి సగం రోజును ప్రజల కోసం, మిగిలిన సగం రోజును కార్యకర్తల కోసం కేటాయిస్తానని తెలిపారు. వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.తెలుగుదేశం పార్టీకి కోటి మందికి పైగా సభ్యులున్నారని చంద్రబాబు తెలిపారు. ఈ స్థాయిలో కార్యకర్తలు ఉన్న పార్టీ దేశంలో మరొకటి లేదన్నారు. ప్రజలు తమపై చూపిన విశ్వాసానికి తగిన విధంగా పాలన అందిస్తామని చెప్పారు.
ఢిల్లీ వరకు ఎదిగిన తెలుగుదేశం పలుకుబడి
ఈసారి ఎన్నికల్లో టీడీపీ భారీ మెజారిటీ సాధించిందని, ప్రజలు నమ్మి ఓటేశారు అన్నారు. ఇప్పుడు ఢిల్లీలో కూడా టీడీపీకి గౌరవం పెరిగిందని చెప్పారు. ప్రజలు, కార్యకర్తలు కలిసి ముందుకు సాగితే ఎలాంటి అడ్డంకులైనా దాటవచ్చని స్పష్టం చేశారు.
Read Also : T20 Cricket : అతి ఉత్కంఠభరిత పోరులో చివరకు నెదర్లాండ్స్ విజయం