ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐటీ రంగంలో వేగంగా ముందుకు దూసుకెళ్తోంది. ఒకప్పుడు హైదరాబాదే ఐటీ హబ్గా పేరుగాంచినా, ఇప్పుడు విశాఖపట్నం, అమరావతి, విజయవాడ, తిరుపతి, గుంటూరు వంటి ప్రాంతాల్లోనూ ఐటీ సంస్థ (IT company) లు తమ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం ఐటీ మ్యాప్లోకి చేరింది. విజయదశమి పర్వదినం సందర్భంగా గుడివాడలో ప్రిన్స్టన్ ఐటీ సర్వీసెస్ (Princeton IT Services) తొలి కార్యాలయాన్ని ప్రారంభించడం విశేషంగా మారింది.
AP GST : ఏపీలో పెరిగిన జీఎస్టీ వసూళ్లు
ఈ సంస్థలో 100 మంది కూర్చునే సామర్థ్యం ఉంది.. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము (Gudivada MLA Venigandla Ramu) ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ప్రిన్స్టన్ సీఈవో రవి తన స్వగ్రామంలో కంపెనీ పెట్టడం ద్వారా గుడివాడ అభివృద్ధికి తోడ్పడ్డారు.గుడివాడ ఎమ్మెల్యే రాము కంపెనీ ఉద్యోగులతో మాట్లాడారు. ప్రిన్స్టన్ ఐటీ సర్వీసెస్ విజయంపై గుడివాడ సక్సెస్ ఆధారపడి ఉందని వ్యాఖ్యానించారు.

ఈ ప్రిన్స్టన్ ఐటీ సంస్థ (Princeton IT company) ను తన సొంత కంపెనీగా భావిస్తానని.. ఈ కంపెనీ విజయానికి తన పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ‘పీ4 స్ఫూర్తి’తో సీఈవో రవి తన స్వగ్రామంలో ఐటీ సంస్థను నెలకొల్పడం ఆదర్శప్రాయమని ఎమ్మెల్యే ప్రశంసించారు.
ఎమ్మెల్యే రాము సహకారంతోనే గుడివాడలో ఈ ఐటీ సంస్థను ఏర్పాటు చేశానని ప్రిన్స్టన్ సీఈవో రవి తెలిపారు. ఈ సంస్థ న్యూజెర్సీ, కెనడా, డొమినికాలో పనిచేస్తుందని.. హైదరాబాద్, కాకినాడలో కూడా దీని కార్యకలాపాలు ఉన్నాయన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: