Latest News: CM Chandrababu: సీఎం చంద్రబాబుతో టీజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ

Read Time:  1 min
Latest News: CM Chandrababu: సీఎం చంద్రబాబుతో టీజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ
FONT SIZE
GET APP

ఈ నెల 8, 9 తేదీల్లో జరిగే, ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును (CM Chandrababu) కలిశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’కు హాజరుకావాల్సిందిగా చంద్రబాబును ఆయన ఆహ్వానించారు.

Read Also: Nara Lokesh : లోకేష్ రాజకీయ ఎంట్రీ గురించి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

TG Minister Komatireddy Venkat Reddy meets CM Chandrababu
TG Minister Komatireddy Venkat Reddy meets CM Chandrababu

ప్రపంచ ప్రఖ్యాత దావోస్ సదస్సు

శుక్రవారం అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ వేదికగా ఈ గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహించనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ఈ సదస్సును ప్రపంచ ప్రఖ్యాత దావోస్ సదస్సు తరహాలో నిర్వహిస్తున్నామని చంద్రబాబు (CM Chandrababu)కు వివరించారు.

ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా పలు ప్రముఖ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు హాజరవుతున్నారని ఆయన పేర్కొన్నారు.తెలంగాణ ప్రభుత్వం తరఫున అధికారికంగా ఆహ్వానాన్ని అందించిన కోమటిరెడ్డి, సమ్మిట్ ప్రాధాన్యతను ముఖ్యమంత్రికి తెలియజేశారు. 

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.