Ponguru Narayana-ఆంధ్రప్రదేశ్లోని టిడ్కో గృహాల లబ్ధిదారులకు రాష్ట్ర గృహనిర్మాణ మంత్రి పొంగూరు నారాయణ శుభవార్త తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న 163 టిడ్కో గృహ సముదాయాలను వచ్చే ఏడాది మార్చి 31 నాటికి లబ్ధిదారులకు అందజేయడానికి చర్యలు చేపడుతున్నామని ఆయన ప్రకటించారు.

కర్నూలు జగన్నాథగట్టు టిడ్కో గృహాల పరిశీలన
కర్నూలు శివారులోని జగన్నాథగట్టు(Jagannathgattu) వద్ద జరుగుతున్న టిడ్కో గృహ నిర్మాణాలను మంత్రి నారాయణ ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గృహ సముదాయాల వద్ద పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, తాగునీటి సదుపాయం వంటి మౌలిక వసతులు కల్పించనున్నామని తెలిపారు. నివాసం మాత్రమే కాకుండా, సమగ్ర జీవన ప్రమాణాలను అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
కర్నూలు గృహాలపై ప్రత్యేక చర్యలు
జగన్నాథగట్టు ప్రాంతంలో నిర్మిస్తున్న 3,056 గృహాలను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఇందుకోసం రూ.1 కోటి తాగునీటి వసతి కోసం, అదనంగా రూ.5 కోట్లు మౌలిక వసతుల కోసం కేటాయించినట్లు వెల్లడించారు. అంతేకాకుండా, పదెకరాల స్థలాన్ని పరిశ్రమల కోసం(Industries)కేటాయించనున్నట్లు తెలిపారు. దీని ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు టీజీ భరత్, గౌరు చరితారెడ్డి, బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్ని టిడ్కో గృహ సముదాయాలు నిర్మిస్తున్నారు?
రాష్ట్ర వ్యాప్తంగా 163 టిడ్కో గృహ సముదాయాలు నిర్మిస్తున్నారు.
ఈ గృహాలను లబ్ధిదారులకు ఎప్పటికి అందజేస్తారు?
వచ్చే ఏడాది మార్చి 31 నాటికి అందజేయనున్నట్లు మంత్రి ప్రకటించారు
Read hindi news:hindi.vaartha.com
Read also: