రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా (Chief Secretary) తెలుగు IAS అధికారి వోరుగంటి శ్రీనివాస్ (Voruganti Srinivas) నియమితులవడం విశేషం. కేంద్ర సర్వీసుల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలోనే ఆయనను రాజస్థాన్ ప్రభుత్వం ప్రత్యేకంగా డిప్యుటేషన్పై రప్పించి, రాష్ట్ర పరిపాలనలో అగ్రస్థాయి పదవిని అప్పగించింది.
Read Also: Weather: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి

భద్రాచలం, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నారు
ఒక తెలుగు అధికారి ఎంపిక కావడం పరిపాలనా వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. (Voruganti Srinivas)ఈయన 1966లో అరకు లోయలో జన్మించారు. భద్రాచలం, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నారు. 1989లో ఎంటెక్ పూర్తయ్యాక IASకు ఎంపికయ్యారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మనవరాలిని శ్రీనివాస్ వివాహం చేసుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: