हिन्दी | Epaper
విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్

Telugu news: TDP: రోజాపై స్థానిక నేతల ఫైర్.. నగరి రాజకీయాల్లో ముగింపు?

Tejaswini Y
Telugu news: TDP: రోజాపై స్థానిక నేతల ఫైర్.. నగరి రాజకీయాల్లో ముగింపు?

TDP Leaders Fire on Roja: మాజీ మంత్రి, వైసీపీ నేత రోజాపై ఆమె సొంత నియోజకవర్గం నగరిలో టీడీపీ(TDP) నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. రోజా రాజకీయంగా ఎదగడం తమ వల్లేనని, ఇప్పుడు ఆమె అహంకారంగా మాట్లాడుతోందని ఆరోపించారు. నగరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీశైలం బోర్డు మాజీ చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి, పలువురు ఎంపీపీలు రోజాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Read Also: Kollikapudi Srinivas: మరోసారి వార్తల్లో తిరువూరు ఎమ్మెల్యే 

రోజా రాజకీయ ప్రస్థానం ముగిసిందని స్పష్టం

ఈ సందర్భంగా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ, నగరిలో రోజా రాజకీయ ప్రస్థానం ముగిసిందని స్పష్టం చేశారు. ఇకపై ఆమె ఈ నియోజకవర్గంలో గెలిచే అవకాశమే లేదన్నారు. ఎంపీపీ ఎన్నికలు పూర్తిగా న్యాయపరంగానే జరిగాయని తెలిపారు. వ్యక్తిగత వ్యాఖ్యలతో రోజా స్థాయిని తానే తగ్గించుకుంటోందని విమర్శించారు. నియోజకవర్గ చరిత్రలోనే అత్యంత ఘోర పరాజయం ఎదుర్కొన్న నాయకురాలిగా రోజా నిలిచిందని వ్యాఖ్యానించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ బలాన్ని ప్రజలకు చూపిస్తామని హెచ్చరించారు.

TDP: Local leaders fire on Roja.. End of Nagari politics

టీడీపీలో ఉన్నప్పుడే రెండుసార్లు ఓడిపోయిన రోజా

వడమాలపేట జడ్పీటీసీ(ZPTC) మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ, రోజా రాజకీయ ఒత్తిడి, అసహనంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాము పార్టీ మారలేదని, టీడీపీలో ఉన్నప్పుడే రెండుసార్లు ఓడిపోయిన రోజా, తరువాత పార్టీ మారి తమ సహకారంతో ఎమ్మెల్యే అయ్యారని చెప్పారు. 2014కు ముందు, తరువాత రోజా పరిస్థితుల్లో వచ్చిన మార్పులే దీనికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.

సీనియర్ నేత అమ్ములు మాట్లాడుతూ, తమ సహాయం లేకపోతే రోజా రాజకీయంగా నిలబడలేదన్నారు. రోజా కుటుంబం నగరి ప్రాంతాన్ని ఆర్థికంగా దోచుకుందని ఆరోపించారు. ఆమె అనవసర వ్యాఖ్యలే రాష్ట్రంలో వైసీపీ పతనానికి కారణమయ్యాయని తెలిపారు. ఇకపై అదుపు తప్పిన మాటలు సహించబోమని కఠిన హెచ్చరిక జారీ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870