TDP Leaders Fire on Roja: మాజీ మంత్రి, వైసీపీ నేత రోజాపై ఆమె సొంత నియోజకవర్గం నగరిలో టీడీపీ(TDP) నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. రోజా రాజకీయంగా ఎదగడం తమ వల్లేనని, ఇప్పుడు ఆమె అహంకారంగా మాట్లాడుతోందని ఆరోపించారు. నగరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీశైలం బోర్డు మాజీ చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి, పలువురు ఎంపీపీలు రోజాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Read Also: Kollikapudi Srinivas: మరోసారి వార్తల్లో తిరువూరు ఎమ్మెల్యే
రోజా రాజకీయ ప్రస్థానం ముగిసిందని స్పష్టం
ఈ సందర్భంగా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ, నగరిలో రోజా రాజకీయ ప్రస్థానం ముగిసిందని స్పష్టం చేశారు. ఇకపై ఆమె ఈ నియోజకవర్గంలో గెలిచే అవకాశమే లేదన్నారు. ఎంపీపీ ఎన్నికలు పూర్తిగా న్యాయపరంగానే జరిగాయని తెలిపారు. వ్యక్తిగత వ్యాఖ్యలతో రోజా స్థాయిని తానే తగ్గించుకుంటోందని విమర్శించారు. నియోజకవర్గ చరిత్రలోనే అత్యంత ఘోర పరాజయం ఎదుర్కొన్న నాయకురాలిగా రోజా నిలిచిందని వ్యాఖ్యానించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ బలాన్ని ప్రజలకు చూపిస్తామని హెచ్చరించారు.

టీడీపీలో ఉన్నప్పుడే రెండుసార్లు ఓడిపోయిన రోజా
వడమాలపేట జడ్పీటీసీ(ZPTC) మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ, రోజా రాజకీయ ఒత్తిడి, అసహనంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాము పార్టీ మారలేదని, టీడీపీలో ఉన్నప్పుడే రెండుసార్లు ఓడిపోయిన రోజా, తరువాత పార్టీ మారి తమ సహకారంతో ఎమ్మెల్యే అయ్యారని చెప్పారు. 2014కు ముందు, తరువాత రోజా పరిస్థితుల్లో వచ్చిన మార్పులే దీనికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.
సీనియర్ నేత అమ్ములు మాట్లాడుతూ, తమ సహాయం లేకపోతే రోజా రాజకీయంగా నిలబడలేదన్నారు. రోజా కుటుంబం నగరి ప్రాంతాన్ని ఆర్థికంగా దోచుకుందని ఆరోపించారు. ఆమె అనవసర వ్యాఖ్యలే రాష్ట్రంలో వైసీపీ పతనానికి కారణమయ్యాయని తెలిపారు. ఇకపై అదుపు తప్పిన మాటలు సహించబోమని కఠిన హెచ్చరిక జారీ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also :