విశాఖ గూగుల్ హబ్పై ప్రధాని మోడీతో సంస్థ సిఇఒ సుందర్ పిచాయ్
విజయవాడ : విశాఖపట్నంలో 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… గూగుల్ (Sundar pichai) మధ్య చారిత్రక ఒప్పందం, జరిగింది. ఈ సందర్భంగా టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్… భారత ప్రధాని నరేంద్రమోడీతో(Narendra Modi) ఫోన్లో మాట్లాడారు. తమ కంపెనీ తొలి ఏఐ హబ్ విశేషాలను ప్రధానితో పంచుకున్నారు. ఈ విషయాన్ని సుంఆదర్ పిచాయ్ తన ‘ఎక్స్’పోస్ట్లో వెల్లడించారు. ‘విశాఖపట్నంలో గూగుల్ తొలి ఏఐ హక్కు సంబంధించిన ప్రణాళికలను పంచుకునేందుకు ప్రధాని మోడీతో మాట్లాడా… ఈ ఏఐ హబ్ ఓ కీలక మైలురాయిగా నిలవనుంది.
Read also: రైలులో దారుణం – మహిళపై దాడి, ఆభరణాలు లూటీ

ఈ హబ్తో ఆధునాతన సాంతేతికతను భారత్ లో సంస్థలకు, వినియోగదారులకు అందించనున్నాం.
ఈ హబ్ గిగావాట్ సామర్థ్యం ఉండే హైపర్ స్కేల్ డేటా సెంటర్, అంతర్జాతీయ సబ్సే గేట్వే, భారీ స్థాయిలో ఇంధన మౌలిక సదుపాయాలు ఉండనున్నాయి. ఈ హబ్తో ఆధునాతన సాంతేతికతను భారత్ లో సంస్థలకు, వినియోగదారులకు అందించనున్నాం. కృతిమ మేధ ఆవిష్కరనలను మరింత వేగవంతం చేస్తాం.’ అని సుందర్ పిచాయ్ రాసుకొచ్చారు. ఢిల్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గూగుల్ మధ్య మంగళవారం ఈ ఒప్పందం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఐటీ, కమ్యూనికేషన్ల శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా గూగుల్ రానున్న ఐదేళ్ళలో సుమారు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. భారత్లో ఈ కంపెనీకి ఇదే అతి పెద్ద పెట్టుబడి. ఈ ఒప్పందం సందర్భంగా గూగుల్ క్లౌడ్ గ్లోబల్ సీఈఓ థామస్ కురియన్ మాట్లాడుతూ… గ్లోబల్ కనెక్టివిటీ హబ్ విశాఖ మారనుందని తెలిపారు. విశాఖ నుంచి 12 దేశాలతో సబ్సీ-కేబుల్ విధానం ద్వారా అనుసంధానం చేస్తామని చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: