हिन्दी | Epaper

Latest treanding news:Srisailam: శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో నిలిచిన ఉత్పత్తి

Saritha
Latest treanding news:Srisailam: శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో నిలిచిన ఉత్పత్తి

హైదరాబాద్ : శ్రీశైలం(Srisailam)ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. విద్యుత్(electricity)కేంద్రంలోని నాలుగో యూనిట్లో మరోసారి సాంకేతిక సమ స్యలు తలెత్తడంతో కరెంటు ఉత్పత్తి నిలిచిపో యింది. పునరుద్ధరించేందుకు కొంత సమయం పడుతుందని జెన్కో ఇంజనీర్లు భావిస్తున్నారు. కాగా 2020 ఆగస్టు 20న షార్ట్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం సంభవించి నాలుగో యూనిట్ అగ్నిప్రమాదానికి గురికాగా, ఆ దుర్ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. తదుపరి ఢిల్లీకి చెందిన వాయిత్ ఇంజనీరింగ్ కంపెనీ ఈ యూనిట్ మరమ్మతు పనులు చేపట్టింది. 2021 సెప్టెంబరులో పనులు ప్రారంభించి 2023 జూలై నాటికి పూర్తి చేసి జెన్కోకు అప్పగించింది.

Read also: నేడు దక్షిణాఫ్రికాతో భారత్ మ్యాచ్

ఆ నెల 17న నాలుగో యూనిట్ను ప్రారంభించి గ్రిడ్కు అనుసంధానం చేశారు. అయితే మళ్లీ 2023 ఆగస్టు 17న స్టేటార్ వైండింగ్ బార్స్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మరోసారి మంటలు చెలరేగి యూనిట్ కాలిపోయింది. గత సంవ త్సరం మరోసారి మరమ్మతు పనులు ప్రారం భించారు. ఇందుకు చైనా నుంచి స్టేటార్ బార్స్ ను రప్పించి బిగించారు. ఏడాది పాటు మరమ్మతు పనులు కొనసాగగా, ఈ నెల 2న విజయదశమి రోజున రాత్రి పూజలు నిర్వహించి ప్రారంభిం చారు. పది గంటలు తిరగకుండానే సాంకేతిక సమస్యలతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. స్టేటార్ మొరాయించడంతో సమస్య మొదటికొ చ్చిందని ఇంజనీర్లు అంటున్నారు. సాంకేతిక సమ స్యలు, ప్రమాదాలను ముందుగా గుర్తించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక సెన్సార్లు కూడా పనిచే యడంలేదని తెలుస్తోంది. తరచూ సాంకేతిక సమస్యలతో విద్యుత్ ఉత్పత్తి(Srisailam) నిలిచిపోవడం, అందుకు గల కారణాలు, లోపాలు, వాటిని అధిగ మించాల్సిన చర్యలు తదితర వాటిపై తదుపరి కార్యాచరణపై మూడు రోజుల్లో నివేదిక ఇవ్వ నున్నట్లు తెలియవచ్చింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870