हिन्दी | Epaper

Sri SathyaSai Baba Jayanthi: వేడుకల కోసం పుట్టపర్తికి 200 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

Pooja
Sri SathyaSai Baba Jayanthi: వేడుకల కోసం పుట్టపర్తికి 200 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

శ్రీ సత్యసాయిబాబా శతజయంతి(Sri SathyaSai Baba Jayanthi) ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని, భక్తులకు సౌకర్యంగా ఉండేలా రాష్ట్రవ్యాప్తంగా 200 ప్రత్యేక బస్సులను పుట్టపర్తి వైపు నడపనున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు.

Read Also: Kartika Purnima: కార్తీక పౌర్ణమి – దీపం ఏ సమయంలో పెట్టాలి?

Sri SathyaSai Baba Jayanthi
Sri SathyaSai Baba Jayanthi

ఇటీవల ఆయన శ్రీ సత్యసాయి(Sri SathyaSai Baba Jayanthi) జిల్లా పుట్టపర్తిని సందర్శించి, జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రశాంతి నిలయంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్టు(Central Trust)) ప్రతినిధులతో సమావేశమై రవాణా సదుపాయాలపై చర్చించారు. శతజయంతి వేడుకలకు దేశ, విదేశాల నుంచి వేలాది భక్తులు రానున్న నేపథ్యంలో, ఎలాంటి రవాణా సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

తరువాత స్థానిక ఆర్టీసీ డిపో, బస్టాండ్‌లను అధికారులతో కలిసి పరిశీలించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడపడం ద్వారా సౌకర్యవంతమైన ప్రయాణం అందించడమే తమ లక్ష్యమని ద్వారకా తిరుమలరావు తెలిపారు. అవసరమైతే అదనపు సర్వీసులను కూడా ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన వెల్లడించారు.

ఇక శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలు నవంబర్ 23న పుట్టపర్తిలో ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారిక పండుగగా ప్రకటించింది. ఉత్సవాల్లో సుమారు 185 దేశాలకు చెందిన భక్తులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు హాజరుకానున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

BYST తో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం

BYST తో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్!

రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్!

మచిలీపట్నం మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఇకలేరు

మచిలీపట్నం మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఇకలేరు

నాన్న అంత్యక్రియలు చేయని కూతుళ్లు.. వృద్ధాశ్రమంలోనే ఖననం

నాన్న అంత్యక్రియలు చేయని కూతుళ్లు.. వృద్ధాశ్రమంలోనే ఖననం

యూట్యూబ్ చూసి నకిలీ మద్యం తయారీ

యూట్యూబ్ చూసి నకిలీ మద్యం తయారీ

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!
0:21

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!

అనుమానంతో భార్యను హత్య చేసి.. మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లిన భర్త

అనుమానంతో భార్యను హత్య చేసి.. మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లిన భర్త

ఐదో రోజు విచారణకు సునీల్ నాయక్

ఐదో రోజు విచారణకు సునీల్ నాయక్

దేశంలోనే అతి పెద్ద మూడో తేరు.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు!

దేశంలోనే అతి పెద్ద మూడో తేరు.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు!

📢 For Advertisement Booking: 98481 12870