Telugu news: SP Balasubrahmanyam: అందరికీ సమానమే నా తండ్రి: ఎస్పీ చరణ్

Read Time:  1 min
SP Balasubrahmanyam
SP Balasubrahmanyam
FONT SIZE
GET APP

SPB Tribute: దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం(SP Balasubrahmanyam) రాజకీయాలకు దూరంగా జీవించారని ఆయన తనయుడు, గాయకుడు ఎస్పీ చరణ్ తెలిపారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి ఆవరణలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడారు. తన తండ్రికి రాజకీయాలకంటే మనుషులే ముఖ్యమని, అందరినీ సమానంగా చూసేవారని పేర్కొన్నారు.

Read also: Delhi: అశ్వినీ వైష్ణవ్‌తో లోకేశ్‌ భేటీ ప్రాజెక్టులకు అండగా ఉంటాం అన్న హామీ

SP Balasubrahmanyam
SP Balasubrahmanyam

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఆవిష్కరించిన వెంకయ్య నాయుడు

ఎస్పీ చరణ్ మాట్లాడుతూ, బాలు ప్రతి వ్యక్తితో స్నేహపూర్వకంగా మెలిగేవారని గుర్తుచేశారు. తన తండ్రి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ(Telangana) ప్రభుత్వానికి, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, అలాగే ఈ కార్యక్రమం కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రవీంద్ర భారతి ప్రాంగణంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని అధికారికంగా ఆవిష్కరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.