हिन्दी | Epaper

ఏపీ బడ్జెట్ పై షర్మిల ఆగ్రహం

Sudheer
ఏపీ బడ్జెట్ పై షర్మిల ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.3.22 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన తొలి పూర్తి స్థాయి బడ్జెట్‌పై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఈ బడ్జెట్ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఉందని, కేవలం అంకెల గారడీ మాత్రమేనని ఆమె వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం మిషన్, విజన్ లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టిందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. ముఖ్యంగా ‘సూపర్ సిక్స్’ పథకాలను పూర్తిగా పక్కన పెట్టడం దారుణమని షర్మిల మండిపడ్డారు.

Caste census should be conducted in AP too.. YS Sharmila

కేంద్రం పై ఆధారపడింది

రైతులకు, విద్యార్థులకు, మహిళలకు తగిన విధంగా నిధులు కేటాయించకపోవడాన్ని ఆమె తప్పుబట్టారు. ‘అన్నదాత సుఖీభవ’ పథకానికి అవసరమైన మొత్తంలో నిధులు కేటాయించకుండా, కేంద్రంపై ఆధారపడేలా చేయడం అన్యాయమని విమర్శించారు. విద్యార్థుల సంక్షేమానికి సరిపడా నిధులు లేకపోవడం, ‘తల్లికి వందనం’ వంటి పథకాలకూ కోత విధించడం విద్యా రంగానికి నష్టమని పేర్కొన్నారు. అలాగే, ‘దీపం-2’ పథకానికి తగిన నిధులు కేటాయించకపోవడం వల్ల లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు.

మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి నిధులు కేటాయించకపోవడం ఏంటి..?

మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి నిధులు కేటాయించకపోవడం, మహిళా ఆర్థిక సాధికారత కోసం ‘మహాశక్తి’ పథకాన్ని పూర్తిగా విస్మరించడం దారుణమని విమర్శించారు. నిరుద్యోగ భృతి, జాబ్ కాలెండర్‌పై ఎటువంటి స్పష్టత ఇవ్వకుండా, 50 లక్షల మంది నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. అంతేగాక, రాజధాని అమరావతికి ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా అప్పులతోనే నిర్మించాలని భావించడం కూటమి ప్రభుత్వ అవివేకానికి నిదర్శనమని షర్మిల వ్యాఖ్యానించారు. బడ్జెట్‌లో ఉన్న అసమతుల్యతలు రాష్ట్ర భవిష్యత్తును ప్రభావితం చేయగలవని ఆమె హెచ్చరించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మచిలీపట్నం మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఇకలేరు

మచిలీపట్నం మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఇకలేరు

నాన్న అంత్యక్రియలు చేయని కూతుళ్లు.. వృద్ధాశ్రమంలోనే ఖననం

నాన్న అంత్యక్రియలు చేయని కూతుళ్లు.. వృద్ధాశ్రమంలోనే ఖననం

యూట్యూబ్ చూసి నకిలీ మద్యం తయారీ

యూట్యూబ్ చూసి నకిలీ మద్యం తయారీ

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!
0:21

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!

అనుమానంతో భార్యను హత్య చేసి.. మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లిన భర్త

అనుమానంతో భార్యను హత్య చేసి.. మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లిన భర్త

ఐదో రోజు విచారణకు సునీల్ నాయక్

ఐదో రోజు విచారణకు సునీల్ నాయక్

దేశంలోనే అతి పెద్ద మూడో తేరు.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు!

దేశంలోనే అతి పెద్ద మూడో తేరు.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు!

హాల్‌టికెట్ల పై క్యూఆర్ కోడ్.. స్కాన్ చేస్తేనే సెంటర్ వివరాలు!

హాల్‌టికెట్ల పై క్యూఆర్ కోడ్.. స్కాన్ చేస్తేనే సెంటర్ వివరాలు!

వేటగాళ్ల ఉచ్చుకు రెండు ఏనుగులు బలి!

వేటగాళ్ల ఉచ్చుకు రెండు ఏనుగులు బలి!

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏఐ ఆధారిత సేవలు ప్రారంభం

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏఐ ఆధారిత సేవలు ప్రారంభం

వడగాల్పుల ముప్పు: రాబోయే 4 రోజులు జాగ్రత్త!

వడగాల్పుల ముప్పు: రాబోయే 4 రోజులు జాగ్రత్త!

చంద్రబాబుకు ఆ పదం పలికే అర్హత లేదు – వైస్ జగన్

చంద్రబాబుకు ఆ పదం పలికే అర్హత లేదు – వైస్ జగన్

📢 For Advertisement Booking: 98481 12870