हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

టీడీపీ కూటమి సర్కారుపై వైఎస్ షర్మిల ఫైర్

Sudheer
టీడీపీ కూటమి సర్కారుపై వైఎస్ షర్మిల ఫైర్

  • అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల రాష్ట్ర ప్రభుత్వం మీద మరోసారి విరుచుకుపడ్డారు. రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ధరల స్థిరీకరణ నిధి పేరుతో చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతులను మోసం చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తూ రైతుల సమస్యలపై స్పందించారు.

పంటకు గిట్టుబాటు ధర లేదు

రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి, కంది రైతులు తీవ్రంగా నష్టపోతుండగా, కూరగాయల ధరలు విపరీతంగా పెరిగినా రైతులకు ఎలాంటి లాభం దక్కడం లేదని మండిపడ్డారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో రాష్ట్రం పంటల దిగుబడుల్లో దేశానికే ఆదర్శంగా ఉండేదని, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారిందని అన్నారు.

Amit Shah is not eligible to enter Andhra.. Sharmila

ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

గత పదేళ్లుగా ఏపీలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని షర్మిల ఆరోపించారు. చంద్రబాబు తన మొదటి పాలనలో ఏడాదికి రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి కల్పిస్తానని మాట తప్పారని, జగన్ సర్కారు కూడా రూ.3 వేల కోట్ల నిధి ఏర్పాటు చేస్తామనే హామీని నిలబెట్టలేదని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వల్ల రైతులు మరింతగా నష్టపోతున్నారని వ్యాఖ్యానించారు.

వరి ధాన్యం ధర పెంచాలి

రాష్ట్రంలో వరి ధాన్యం బస్తాకు రూ.1400కు మించి ధర లభించడం లేదని, పత్తి ధర రూ.12 వేల నుంచి రూ.6 వేల వరకు పడిపోయిందని షర్మిల గుర్తుచేశారు. రైతుల జీవితాలు ఆర్థికంగా మరింత సంక్షోభానికి గురవుతున్నాయని, ప్రభుత్వం తక్షణమే స్పందించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కేవలం మాటలు చెప్పడం కాకుండా రైతులకు ఆర్థికంగా సహాయపడేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి

రైతులకు గిట్టుబాటు ధర అందించేందుకు ప్రభుత్వం వెంటనే రూ.5 వేల కోట్ల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. అంతేకాక, అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఇచ్చే రూ.20 వేల ఆర్థిక సహాయాన్ని తక్షణమే వారి ఖాతాల్లో జమ చేయాలని సూచించారు. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పోరాడుతుందని, వారికి న్యాయం జరిగే వరకు నిశ్చలంగా ఉండబోమని స్పష్టం చేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870