Kanipakam : కాణిపాకం శ్రీవరసిద్ది వినాయక స్వామివారి దేవస్థానంలో జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రముఖులను ఆహ్వానిస్తూ మంగళవారం దేవస్థానం తరపున ఆహ్వానపత్రికలను అందజేశారు. దేవస్థానంలో ఈనెల 27 నుండి సెప్టెంబర్ 16 వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు 21 రోజుల పాటు జరుగనున్నాయి. ఈమేరకు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి మండిపల్లె రాంప్రసాద్ రెడ్డి (Minister Mandipalle Ramprasad Reddy) రాష్ట్ర దేవాదాయశాఖ కమీషనర్ రామచంద్రమోహన్లను అమరావతిలోని సచివాలయంలో పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్, కాణిపాకం ఆలయ ఏఈఓ ధనుంజయ, స్థానిక టీడీపీ నాయకులతో కలసి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికలను అందజేశారు. అనంతరం దేవస్థానం తరపున అర్చకులు, వేపదండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి చిత్రపటాన్ని, శేషవస్త్రాలను, ప్రసాదాలను అందజేశారు. ఆలయ మాజీ చైర్మన్ మణినాయుడు (Former temple chairman Maninaidu) టీడీపీ ఐరాల మండల అధ్యక్షుడు హరిబాబునాయుడు, జడ్పీటీసీ సుచిత్ర, నాయకులు గిరధర్బాబు, నాయకులు హేమాద్రినాయుడు, నరసింహులునాయుడులతో అర్చకులు, వేదపండితులుపాల్గొన్నారు.

READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :