Latest news: Sanjay Kumar: ప్రయాణికుల భద్రతపై దృష్టి కేంద్రీకరించాలి

Read Time:  1 min
Sanjay Kumar
Sanjay Kumar
FONT SIZE
GET APP

మొంథా తుపాన్ సంసిద్ధతపై దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సమీక్ష

హైదరాబాద్ : ప్రయాణికులకు ఉత్తమ భద్రతను(Sanjay Kumar ) కల్పించే ప్రయత్నాలపై దృష్టి పెట్టాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ అధికారులకు సూచించారు. మొంథా తుపాను పరిస్థితిని ఎదుర్కోవడానికి సంసిద్ధత దిశగా రైలు కార్యకలాపాల భద్రత, కార్యాచరణ ప్రణాళికపై మంగళవారం సికింద్రాబాద్ లోని రైల్ నిలయం నుండి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు జనరల్ మేనేజర్ సత్యప్రకాష్, వివిధ శాఖలకు చెందిన ప్రధానాధిపతులతో పాటు మొత్తం 6 డివిజన్లైన సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్లు, గుంటూరు, నాందేడ్ డివిజనల్ రైల్వేమేనేజర్లు (డి.ఆర్.ఏంలు) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. సంజయ్ కుమార్ శ్రీవాస్తవ రాబోయే మోంతా తుఫాన్ దృష్ట్యా అన్ని విభాగాల ప్రధానాధిపతులతోపాటు పాటు ముఖ్యంగా విజయవాడ, గుంటూరు డివిజన్లతో కూడా వివరణాత్మక సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ తుఫానును ఎదుర్కో వడానికి రైల్వేలు తీసుకుంటున్న వివిధ చర్యలను సమీక్షించారు. వివిధ డిపోలలో రుతుపవనాల సంసిద్ధత కోసం చేసిన నిల్వల స్థితిని ఆయన సమీక్షిం చారు. వివిధ ప్రదేశాలలో తగినంత నిల్వలను మోహరించాలని అధికారులను ఆదేశించారు. తుఫాను మార్గాన్ని నిశితంగా పరిశీలిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్ఆర్ఎఫ్) బృందాలతో సన్నిహితంగా వ్యవహరించి, ట్రాక్ మరియు రైలు కార్యకలాపాల భద్రతను నిర్ధారించడానికి ఈ విభాగంలో రైల్వే ప్రభావిత ట్యాంకుల స్థానాన్ని పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. ప్రభావితమయ్యే విభాగాలలో ట్రాక్లపై పెట్రోలింగ్ ఉండేలా చూడాలని కూడా ఆయన ఆదేశించారు. వాస్తవ సమయ సమాచారాన్ని పొందడానికి అన్ని వంతెనలు, ప్రదేశాలలో స్టేషనరీ వాచ్మెన్లను కూడా నియమించాలని తెలిపారు.

Read also: మాన్యుఫ్యాక్చరింగ్ సెంటర్ ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

Sanjay Kumar
Sanjay Kumar: ప్రయాణికుల భద్రతపై దృష్టి కేంద్రీకరించాలి

ఎంప్లాయీ ఆఫ్ ది మంత్ అవార్డులను అందజేసిన జిఎం

జనరల్ మేనేజర్(Sanjay Kumar )సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సిబ్బందికి ‘ఎంప్లాయీ ఆఫ్ ది మంత్’ భద్రతా అవార్డులను ప్రదానం చేశారు. ఈ అవార్డుగ్రహీతలలో స్టేషన్ మాస్టర్స్, లోకో పైలట్లు, పాయింట్స్ మ్యాన్, కీ మ్యాన్ వంటి వంటి వివిధ కేటగిరి లకు చెందినవారు ఉన్నారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ అవార్డు గ్రహీతలను అభినందించారు. వారి విధులను అత్యంత అంకితభావంతో నిర్వర్తించడంలో వారి నిబద్ధతను అభినందించారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.