Latest News: Puttaparthi: పుట్ట‌ప‌ర్తి శ్రీ స‌త్య‌సాయి శ‌త జ‌యంతి ఉత్స‌వాల్లో పాల్గొన్న స‌చిన్, ఐశ్వ‌ర్య‌రాయ్

Read Time:  1 min
Latest News: Puttaparthi: పుట్ట‌ప‌ర్తి శ్రీ స‌త్య‌సాయి శ‌త జ‌యంతి ఉత్స‌వాల్లో పాల్గొన్న స‌చిన్, ఐశ్వ‌ర్య‌రాయ్
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తి (Puttaparthi) శ్రీ స‌త్య‌సాయి శ‌త జ‌యంతి ఉత్స‌వాలకి ముస్తాబైంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ క్ర‌మంలో పుట్ట‌ప‌ర్తి(Puttaparthi) లోని హిల్ వ్యూ ఆడిటోరియం స‌ర్వాంగ సుంద‌రంగా ముస్తాబైంది.

Read Also: Tulasi: సినిమాలకి తులసి గుడ్ బై

Sachin, Aishwarya Rai attend Sri Sathya Sai Centenary celebrations in Puttaparthi
Sachin, Aishwarya Rai attend Sri Sathya Sai Centenary celebrations in Puttaparthi

సత్యసాయి మహా సమాధిని స‌చిన్, ఐశ్వ‌ర్య రాయ్ దర్శించుకున్నారు

ప్రశాంత నిలయంతో పాటు చుట్టుపక్కల ఆలయాల భవనాలన్నీ రంగు రంగుల దీపాలతో అత్యంత సుందరంగా సిద్ధం చేశారు. శ్రీ స‌త్య‌సాయి శ‌త జ‌యంతి వేడుక‌ల‌కు లెజెండ‌రీ క్రికెట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్, ఐశ్వ‌ర్య రాయ్ బ‌చ్చ‌న్ హాజ‌ర‌య్యారు. ప్రశాంతి నిలయంలో సత్యసాయి మహా సమాధిని స‌చిన్, ఐశ్వ‌ర్య రాయ్ దర్శించుకున్నారు.

ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్​ను మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) మర్యాదపూర్వకంగా కలిశారు. సచిన్​ను కలిసిన వారిలో మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్ ఉన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.