- ప్రొద్దుటూరు (Proddatur) వద్ద వాహన తనిఖీల్లో పట్టుబడ్డ 16 ఎర్రచందనం దుంగలు
- 18మంది స్మగ్లర్లు అరెస్టు
- రెండు కార్లు సీజ్ చేసిన టాస్క్ ఫోర్స్
- స్మగ్లర్లు నుంచి గొడ్డళ్లు, బారిసలు, రంపపు చుట్ట స్వాధీనం
ప్రొద్దుటూరు-జమ్మల మడుగు
కడప జిల్లా ప్రొద్దుటూరు-జమ్మల మడుగు మార్గంలో తనిఖీలు నిర్వహించిన టాస్క్ ఫోర్స్ పోలీసులకు 16 ఎర్రచందనం దుంగలు, రెండు కార్లు, గొడ్డళ్లు, బారిసలు, రంపపు చుట్ట పట్టుబడ్డాయి. (RSASTF) 18మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ హెడ్ శ్రీ ఎల్. సుబ్బారాయుడు గారి ప్రత్యేక కార్యాచరణలో భాగంగా టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీ పీ శ్రీనివాస్ (Sri P Srinivas) గారి ఆధ్వర్యంలో డీఎస్పీ శ్రీ ఎండీ షరీఫ్ మార్గ నిర్దేశకత్వంలో కడప సబ్ కంట్రోల్ కు చెందిన ఆర్ఎస్ఐ ఎం. మురళీధర్ రెడ్డి టీమ్ శుక్రవారం ప్రొద్దుటూరు – జమ్మలమడుగు మార్గంలో వాహనాల తనిఖీ చేపట్టారు.

RSASTF
పెద్దశేట్టి పల్లి వద్ద
పెద్దశేట్టి పల్లి వద్ద రెండు కార్లు వేగంగా వస్తూ కనిపించాయి. తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి వాహనాలు అపి, కార్లు దిగి పారిపోసాగారు. అప్రమత్తమైన టాస్క్ ఫోర్స్ పోలీసులు, వారి వెంటపడి 18 మందిని పట్టుకున్నారు. కార్లు తనిఖీ చేయగా అందులో 16 ఎర్రచందనం (Red sandalwood) దుంగలు, 4 పిడిలేని గొడ్డళ్లు, 4 పిడిలేని బారిసలు, రంపపు చుట్ట కలిగి ఉన్నాయి. (RSASTF) పట్టుబడిన వారు తమిళనాడుకు చెందిన వారుగా గుర్తించారు. వారిని ఎర్రచందనం దుంగలు సహా స్వాధీనం వస్తువులతో తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు. వారిని డీఎస్పీ వీ. శ్రీనివాసరెడ్డి, ఏసీఎఫ్ జె. శ్రీనివాస్ విచారించారు. ఎస్ఐ రఫీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఏ సంఘటనలో ఎర్రచందనం దుంగలు, కార్లు స్వాధీనం చేసుకున్నాయి?
కడప జిల్లా ప్రొద్దుటూరు-జమ్మలమడుగు మార్గంలో వాహన తనిఖీలు చేసిన టాస్క్ ఫోర్స్ కార్యాచరణలో.
ఎన్ని ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు?
16 ఎర్రచందనం దుంగలు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: