శ్రీకాకుళం: srikakulam వంశధార ఉద్ధృతం – 10 మండలాల్లో విద్యాసంస్థలకు సెలవు ఉత్తరాంధ్రను వణికిస్తున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం Andhra జిల్లా అతలాకుతలమవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. ముఖ్యంగా వంశధార నదికి వరద ప్రవాహం పెరిగిపోవడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అకస్మిక వరదల ప్రమాదం దృష్ట్యా ముందస్తు జాగ్రత్త చర్యగా విద్యాసంస్థలకు శుక్రవారం సెలవు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు సహా అన్ని విద్యాసంస్థలకు వర్తిస్తాయి.
AP: విశాఖలో బలమైన ఈదురుగాలులకు నేలకూలిన భారీ వృక్షాలు

సెలవు ప్రకటించిన మండలాలు:
నరసన్నపేట, జలుమూరు, ఆమదాలవలస, పోలాకి, కొత్తూరు, హిరమండలం, Andhra శ్రీకాకుళం, గార, సరుబుజ్జిలి, ఎల్.ఎన్.పేట. అధికారులు తల్లిదండ్రులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వరద నీరు పెరుగుతున్న ప్రాంతాల్లో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
శ్రీకాకుళం జిల్లాలో విద్యాసంస్థలకు ఎందుకు సెలవు ప్రకటించారు?
వంశధార నది వరద ఉద్ధృతం, ఎడతెరిపిలేని వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు కారణంగా విద్యార్థుల భద్రత కోసం ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
ఎన్ని మండలాల్లో సెలవు అమలులోకి వచ్చింది?
మొత్తం 10 మండలాల్లో సెలవు అమలులోకి వచ్చింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: