हिन्दी | Epaper
రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

Breaking News – Private Bus Accident : ఏపీలో ప్రవైట్ బస్సు బోల్తా..ఇద్దరు మృతి

Sudheer
Breaking News – Private Bus Accident : ఏపీలో ప్రవైట్ బస్సు బోల్తా..ఇద్దరు మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో దుర్ఘటన చోటుచేసుకుంది. సోమవారం ఉదయం చేవెళ్ల బస్సు ప్రమాదం మరువకముందే, ఏలూరు జిల్లా లింగపాలెం మండలంలోని జూబ్లీ నగర్ సమీపంలో జరిగిన బస్సు ప్రమాదం విషాదం నింపింది. ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న భారతి ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం సంభవించిన క్షణాల్లో రోడ్డు పై తీవ్ర ఆందోళన నెలకొంది. స్థానికులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించి, గాయపడిన వారిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు.

Latest News: Modi Bihar: బిహార్ అభివృద్ధి ఆర్జేడీ చేతుల్లో నాశనం అయింది – ప్రధాని మోదీ

సమాచారం అందుకున్న వెంటనే లింగపాలెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని లింగపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాదం సంభవించిన సమయానికి బస్సులో సుమారు 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. వేగం ఎక్కువగా ఉండటం, రోడ్డు మలుపులో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక సమాచారం. బస్సు పూర్తిగా ధ్వంసమవడంతో పోలీసులు మెకానికల్ సిబ్బందిని పిలిపించి వాహనాన్ని తొలగించే చర్యలు చేపట్టారు.

ఈ ఘటనతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. రోడ్డు ప్రమాదాలు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల చేవెళ్లలో జరిగిన ఘోర ప్రమాదం తరువాత ఇలాంటి మరొక దుర్ఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది. రవాణా శాఖ అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ నిర్లక్ష్యం, వాహనం సాంకేతిక లోపం లేదా రోడ్డు పరిస్థితులు ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870