हिन्दी | Epaper
రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం బస్సు బోల్తా ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం బస్సు బోల్తా ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం బస్సు బోల్తా ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం బస్సు బోల్తా ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు

మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై పోక్సో కేసు

sumalatha chinthakayala
మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై పోక్సో కేసు

అమరావతి: వైసీపీ సీనియర్ నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై విజయవాడ పోలీసులు పోక్సో కేసు పెట్టారు. అంతేకాకుండా, నేడు విచారణకు హాజరుకావాలని సైబర్ క్రైమ్ పోలీసుల నోటీసులు ఇచ్చారు. దీనిపై గోరంట్ల మాధవ్ స్పందిస్తూ.. పోలీసుల విచారణకు హాజరవుతానని పేర్కొన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల విజయవాడకు వెళ్లలేకపోయానని మాజీ ఎంపీ పేర్కొన్నారు.

మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్

వైసీపీ లీగల్ టీమ్‌ను ఏర్పాటు

వీలైతే బుధవారం సాయంత్రం లేదా రేపు విజయవాడకు వెళ్తానని గోరంట్ల మాధవ్ తెలిపారు. తన కోసం వైసీపీ లీగల్ టీమ్‌ను ఏర్పాటు చేసిందని, పార్టీ ఎప్పుడూ కార్యకర్తలకు అండగా ఉంటుందని గోరంట్ల మాధవ్ వెల్లడించారు. ఈ మేరకు ఈ నెల 5వ తేదీన సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలని కొంతకాలం క్రితం నోటీసులు ఇచ్చారు. తన న్యాయనిపుణులతో సంప్రదించిన అనంతరం విచారణకు హాజరు కావాలని గోరంట్ల మాధవ్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన అనంతపురం నుంచి బయలుదేరి ఈరోజు విజయవాడకు చేరుకోనున్నారు.

వల్లభనేని వంశీ, పోసాని చట్టపరమైన చర్యలు

అసభ్యకరమైన వీడియో కాల్ సంఘటనకు సంబంధించి వైఎస్‌ఆర్‌సిపి మాజీ ఎంపి గోరంట్ల మాధవ్‌కు పోలీసు నోటీసు జారీ చేయబడింది. వల్లభనేని వంశీ, పోసాని కృష్ణ మురళి మరియు నందిగాం సురేష్‌లపై ఇటీవల చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత, ఇది కీలక వైఎస్‌ఆర్‌సిపి నాయకులకు మరింత ఎదురుదెబ్బ తగిలింది. గతంలో వివాదాలకు కేంద్రబిందువైన గోరంట్ల మాధవ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు ఎదుర్కొంటున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870