పల్నాడు జిల్లా కారంపూడిలో నిర్వహించిన చారిత్రక పల్నాటి వీరుల తిరునాళ్లు(Palnati VeerulaTirunallu) తీవ్ర విషాదానికి గురయ్యాయి. నాగులేరులో పుణ్యస్నానం కోసం దిగిన ఇద్దరు భక్తులు విద్యుత్ ప్రమాదానికి గురయ్యారు. వారిలో ఒకరు అక్కడికక్కడే మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
Read Also: Hyderabad Accident: ఘోర ప్రమాదం.. భయానక ఫొటో
తెగిన విద్యుత్ తీగే ప్రమాదానికి కారణం
ప్రతి సంవత్సరం వైభవంగా జరిగే ఈ తిరునాళ్ల(Palnati VeerulaTirunallu) చివరి రోజున ఈ ఘటన చోటుచేసుకుంది. ఆచారంలా నిర్వహించే కొణతాల (ఆయుధాల) స్నానోత్సవం కోసం భక్తులు నాగులేరులోకి దిగారు. అయితే, ముందుగా తెగి నీటిలో పడిన విద్యుత్ తీగను వారు గుర్తించకపోవడంతో నీటిలోకి అడుగుపెట్టగానే విద్యుదాఘాతానికి గురయ్యారు.
ఒకరు దుర్మరణం, మరొకరికి చికిత్స
విద్యుత్ ఝలక్తో ఒకరు వెంటనే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన మరొకరిని స్థానికులు స్పందించి సీపీఆర్ అందించి, అనంతరం నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదం సమయంలో యాత్రలో పాల్గొన్న వారు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రతి ఏటా భక్తి, ఉత్సాహంతో జరిగే తిరునాళ్లలో ఇలాంటి ప్రమాదం చోటుచేసుకోవడంతో స్థానికులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper: epapervaartha.com
Read Also: