ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ధృఢ నిశ్చయంతో ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్నం ప్రాంతాన్ని ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఆయన తీసుకుంటున్న చర్యలు కీలకంగా నిలుస్తున్నాయి.తాజాగా శుక్రవారం ఆయన సచివాలయంలో నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యంతో (With NITI Aayog CEO Subrahmanyam) సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర ఆర్థిక ప్రగతి, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై విస్తృత చర్చ జరిగింది. రాష్ట్రాన్ని నూతన దిశలో తీసుకెళ్లేందుకు గణనీయమైన నిర్ణయాలు తీసుకున్నారు.
విశాఖ ఎకనామిక్ రీజియన్
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, విశాఖపట్నం కేంద్రంగా 8 జిల్లాలు కలుపుతూ ఓ ప్రత్యేక ఆర్థిక మండలిని – విశాఖ ఎకనామిక్ రీజియన్ స్థాపించనున్నట్టు ప్రకటించారు. ఉపాధి అవకాశాలు పెరిగేలా, పారిశ్రామికవృద్ధికి దోహదపడేలా ఈ రీజియన్ పని చేయనుంది.2032 నాటికి రాష్ట్ర ఆర్థిక స్థాయిని $120 బిలియన్లకు చేరాలన్న లక్ష్యాన్ని సీఎం ముందుపెట్టారు. దీనికి అనుగుణంగా దశలవారీగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ముంబై తరహాలో విశాఖపట్నాన్ని దేశ ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దడమే దీని వెనుకున్న అసలైన దృక్పథం.అంతేకాకుండా, రాష్ట్రంలో పారిశ్రామిక ప్రాజెక్టులకు మౌలిక సదుపాయాల అవసరం ఉంటుందని గుర్తించి, లక్ష ఎకరాల భూమిని గుర్తించాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించారు. ఈ భూముల్లో కొత్త పరిశ్రమలు, ఐటీ పార్కులు, స్టార్టప్ కేంద్రాలు స్థాపించాలన్న దృష్టితో ముందుకెళ్తున్నారు.
కాకినాడ వరకు బీచ్ కారిడార్ నిర్మాణాన్ని
అదే సమయంలో, మూలపేట నుంచి కాకినాడ వరకు బీచ్ కారిడార్ నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్టు సీఎం తెలిపారు. ఈ రహదారి రవాణా సౌలభ్యం పెంచడమే కాకుండా, పర్యాటక అభివృద్ధికి కూడా సహకరించనుంది.ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేలా ఉండబోతున్నాయని, ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. విశాఖపట్నం ఆధారిత ఈ అభివృద్ధి పథకాలు రాష్ట్రానికి గణనీయమైన మార్పును తీసుకురావడం ఖాయం.
Read Also : Rose Apple : రోజ్ యాపిల్ బెనిఫిట్స్ : క్యాన్సర్ నివారణకు దోహదపడుతుంది