ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఒక వినూత్న మరియు ప్రజా అనుకూలమైన నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్ర ప్రజలకు నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండేలా ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆదివారాల్లోనూ రేషన్ షాపులు తెరిచి ఉంచే విధానాన్ని ప్రవేశపెట్టింది. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు.

ప్రజల సౌలభ్యం కోసం ఆదివారం సేవలు
విజయవాడ (Vijayawada) లో జరిగిన రేషన్ పంపిణీ ట్రయల్ రన్ను పరిశీలించిన అనంతరం మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ, మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. గతంలో రేషన్ వాహనాల కోసం పనులు మానుకుని గంటల తరబడి ఎదురుచూడాల్సిన దుస్థితి ఉండేదని, ఆ ఇబ్బందులను తొలగించడమే కాకుండా, లబ్ధిదారులకు మరింత వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
ప్రజల అభినందనలు – ప్రభుత్వానికి మద్దతు
ప్రజల సౌలభ్యమే మా ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత. జూన్ 1 నుంచి 15 రోజుల పాటు రేషన్ సరుకులు పంపిణీ చేస్తాం. ఈ పదిహేను రోజుల్లో ఆదివారంతో సహా అన్ని రోజులూ షాపులు తెరిచే ఉంటాయి. దీనివల్ల రోజువారీ పనులకు వెళ్లేవారు, కూలీలు, ప్రైవేటు ఉద్యోగులు తమకు వీలైన సమయంలో, ముఖ్యంగా సెలవు దినమైన ఆదివారం కూడా రేషన్ తీసుకునేందుకు అవకాశం కలుగుతుంది అని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
డీలర్లకు స్పష్టమైన ఆదేశాలు
లబ్ధిదారులు పనిదినాల్లో రేషన్ తీసుకోలేక ఇబ్బందులు పడేవారని, ఆదివారం షాపులు తెరిచి ఉంచడం వల్ల అలాంటి సమస్యలకు తెరపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా పట్టణ, నగర ప్రాంతాల్లోని ప్రైవేటు సంస్థల్లో పనిచేసే వారికి, వారాంతంలో మాత్రమే తీరిక దొరికే వారికి ఈ నిర్ణయం ఎంతో ఊరటనిస్తుందని అధికారులు చెబుతున్నారు. వృద్ధులు, దివ్యాంగులు షాపులకు రాలేని పక్షంలో, వారి ఇళ్ల వద్దకే సరుకులు అందజేసేలా డీలర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు కూడా మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు.
Read also: Chandrababu Naidu: సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు