ఏపీ కూటమి ప్రభుత్వం తాజగా చేపట్టిన జిల్లాల పునర్విభజనకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడ్డాయి. గత ప్రభుత్వ కాలంలో చేసిన పునర్విభజనలో పలు లోపాలు ఉన్నాయని గుర్తించిన కొత్త ప్రభుత్వం—మంత్రుల కమిటీ ద్వారా సమగ్ర అధ్యయనం జరిపించి సరిహద్దుల్లో మార్పులు చేసింది. ఈ ప్రక్రియలో మూడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి, ఐదు రెవెన్యూ డివిజన్లను కూడా ప్రకటించింది. అయినప్పటికీ జిల్లాల పేర్లు, హద్దులు మార్చాలన్న డిమాండ్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
Read Also: Indian Railways: ఏపీ నుంచి అయోధ్య–వారణాసి మార్గానికి వందేభారత్ స్లీపర్

అమరావతి పరిధిలో మూడు నియోజకవర్గాల మార్పుపై వివాదం
కృష్ణా జిల్లాలోని నూజివీడు, గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో విలీనం చేయాలన్న విస్తృతమైన డిమాండ్ ఉన్నప్పటికీ, పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అభ్యంతరాలతో ఈ ప్రతిపాదనను సీఎం చంద్రబాబు తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ(MLA BondaUma) కొత్తగా మరో డిమాండ్ను ముందుకు తెచ్చారు. కాపునాడు స్వరోత్సవం కార్యక్రమంలో మాట్లాడుతూ—కృష్ణా జిల్లాకు కాపు నేత, ప్రజానాయకుడు వంగవీటి రంగా పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి దీనిపై అధికారికంగా విజ్ఞప్తి చేస్తానని ఆయన ప్రకటించారు.
గతంలో కూడానే వచ్చిన డిమాండ్
వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో కూడా కృష్ణా లేదా ఎన్టీఆర్ జిల్లాలకు రంగా పేరు ఇవ్వాలన్న డిమాండ్లు వచ్చినప్పటికీ, అప్పటి ప్రభుత్వం ఈ విషయంపై నిర్ణయం తీసుకోలేదు. తాజా డిమాండ్(MLA BondaUma) నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆసక్తిగా మారింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: