हिन्दी | Epaper
అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Latest News: Minister Narayana – వచ్చే జూన్ నాటికి టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తాం: మంత్రి

Anusha
Latest News: Minister Narayana – వచ్చే జూన్ నాటికి టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తాం: మంత్రి

ఆంధ్రప్రదేశ్‌లోని పేదవారికి మంచి శుభవార్త. రాష్ట్రంలోని టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు త్వరలో తమ ఇళ్లలోకి ప్రవేశించే అవకాశం దక్కనుంది. ఈ విషయాన్ని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ (Minister Ponguru Narayana) అసెంబ్లీలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో సోమవారం జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో, వివిధ ఎమ్మెల్యేలు రాష్ట్రంలో టిడ్కో ఇళ్ల ప్రగతి, లబ్ధిదారుల సమస్యల గురించి ప్రశ్నలు అడిగారు.

వీటికి సమాధానం ఇచ్చిన మంత్రి నారాయ‌ణ‌.. 2026 జూన్ నెలాఖ‌రులోపు రాష్ట్రంలోని 2,61,640 టిడ్కో ఇళ్లను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఆ దిశగా ముందుకెళ్తున్నట్లు వివరించారు. అలాగే ఎక్కడైనా టిడ్కో ఇళ్లు పూర్తి అయితే.. ప్రతి శనివారం వాటిని లబ్ధిదారులకు అందించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి నారాయణ అసెంబ్లీలో ప్రకటించారు. ఈ మేరకు మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ల (Municipal Commissioners) కు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.

Minister Narayana
Minister Narayana

కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలు

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా టిడ్కో ఇళ్ల నిర్మాణంతో పాటుగా కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలు, మౌలిక వసతుల కల్పన కోసం రూ.7280 కోట్లు అవసరం అవుతాయని మంత్రి నారాయణ వివరించారు. ఈ నిధులను వివిధ బ్యాంకుల నుంచి రుణాల రూపంలో, హడ్కో ద్వారా సమీకరిస్తున్నట్లు తెలిపారు. టిడ్కో ఇళ్ల (Tidco houses) విషయానికి వస్తే 2014-19 మధ్యకాలంలో కేంద్రం ఏపీకి 7,01,481 టిడ్కో ఇళ్లు కేటాయించింది.

వీటిలో సుమారుగా ఐదు లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు లభించాయి. అనంతరం ఈ ఇళ్ల నిర్మాణానికి టెండర్లు కూడా పిలిచారు. అయితే వైసీపీ ప్రభుత్వం వీటిని 2,61,640 కు త‌గ్గించిందని మంత్రి నారాయణ ఆరోపించారు. ఆ ఇళ్ల నిర్మాణాలు కూడా పూర్తి చేయలేదని నారాయణ విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టిడ్కో ఇళ్ల మీద ప్రత్యేక దృష్టి సారించి.. త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటోందని వివరించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/ap-metro-big-update-on-ap-metro-rail-projects/andhra-pradesh/552253/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870