ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఆస్ట్రేలియా పర్యటనకు నేడు బయల్దేరారు. ఈ నెల 24 వరకు ఆయన పర్యటన కొనసాగనుంది. ఆస్ట్రేలియా హైకమిషనర్ ఆహ్వానం మేరకు “స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్”లో పాల్గొనడానికి ఈ పర్యటనను చేపట్టారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆహ్వానం, పారిశ్రామిక వాతావరణం వంటి అంశాలను అంతర్జాతీయ స్థాయిలో వివరించేందుకు లోకేశ్ ఈ పర్యటనను కీలకంగా భావిస్తున్నారు. ఆస్ట్రేలియాలోని రాజకీయ, వ్యాపార నాయకులతో భేటీ అవుతూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవకాశాలను వివరించనున్నారు.
Breaking News – Application for Liquor Stores : 68,900 అప్లికేషన్లు.. మరో 30 వేలు వచ్చే ఛాన్స్
లోకేశ్ పర్యటనలో ప్రధాన ఉద్దేశ్యం రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం. వచ్చే నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగబోయే “సీఐఐ భాగస్వామ్య సదస్సు”ని విజయవంతం చేయడానికి ఆయన ఆస్ట్రేలియన్ ఇన్వెస్టర్లు, పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు. ఈ సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు, టెక్నాలజీ, విద్య, పర్యాటక రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఆస్ట్రేలియాలోని ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో ఉన్న రవాణా, విద్యుత్, నైపుణ్య మానవవనరుల సామర్థ్యాలను వివరించనున్నారు.

ఈ రోజు స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11.30కు లోకేశ్ ఆస్ట్రేలియాకు చేరుకోనున్నారు. సాయంత్రం సిడ్నీలో తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో పాల్గొని ప్రవాసాంధ్రులతో సమావేశమవుతారు. విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలతో అనుబంధాన్ని బలపరచడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి వారు చేయగల సహకారం గురించి చర్చిస్తారు. ప్రవాసాంధ్రులు రాష్ట్రానికి పెట్టుబడులు, సాంకేతిక సహకారం అందించాలనే ఆహ్వానం లోకేశ్ తరఫున ఉండనుంది. ఈ పర్యటన ద్వారా ఆంధ్రప్రదేశ్కు కొత్త పెట్టుబడుల మార్గం సుగమమవుతుందని ప్రభుత్వ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.