ఏపీ లిక్కర్ స్కామ్ విచారణలో మిథున్ రెడ్డి ఏపీ లిక్కర్ స్కామ్ (Liquor scam) లో నిందితుడిగా ఉన్న వైసీపీ (YCP) ఎంపీ మిథున్ రెడ్డి సిట్ కస్టడీ రెండో రోజు విచారణ పూర్తి అయింది. శనివారం నాడు సుమారు నాలుగు గంటలపాటు అధికారులు ఆయనను ప్రశ్నించారు. విచారణ పూర్తయ్యాక ఆయన్ను ఏసీబీ (ACB) ప్రత్యేక కోర్టుకు తీసుకెళ్లి హాజరుపరిచే ఏర్పాట్లు చేస్తున్నారు.

Liquor scam
50కి పైగా ప్రశ్నలు వేసినట్లు
రాజమహేంద్రవరం జైలు నుంచి విజయవాడకు తరలించిన మిథున్ రెడ్డిని శుక్రవారం కూడా నాలుగు గంటలకు పైగా అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే. రెండు రోజుల కస్టడీలో ఆయనపై 50కి పైగా ప్రశ్నలు వేసినట్లు సమాచారం. స్కామ్కు (Liquor scam) సంబంధించిన కొన్ని కీలక అంశాలపై సమగ్రంగా ఆరా తీసినట్టు తెలుస్తోంది. విచారణ పూర్తికావడంతో మిథున్ రెడ్డి (Mithun Reddy) ని మళ్లీ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఏపీ లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి పై ఎన్ని రోజులు సిట్ విచారణ జరిగింది?
రెండు రోజుల పాటు సిట్ అధికారులు మిథున్ రెడ్డిని ప్రశ్నించారు.
రెండో రోజు విచారణ ఎన్ని గంటలు సాగింది?
సుమారు నాలుగు గంటల పాటు కొనసాగింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: