ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక మలుపు తిరగబోతోంది. రాష్ట్రంలో మంత్రి నారా లోకేశ్, (Minister Nara Lokesh) ప్రముఖ నాయకుడు వంగవీటి రాధాకృష్ణ (రాధా) ఈరోజు ఒకే వేదికపై కలవబోతుండటంతో రాజకీయ వర్గాల్లో భారీ చర్చ నడుస్తోంది. దాదాపు 11 నెలల విరామం తర్వాత ఈ ఇద్దరు నేతలు భేటీ కావడం గమనార్హం. ఈ సమావేశం వెనుక దాగి ఉన్న అజెండా ఏమిటి? అనే అంశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.నారా లోకేశ్ కార్యాలయం నుంచి వచ్చిన ఆహ్వానం మేరకు వంగవీటి రాధా ఈ సమావేశానికి హాజరవుతున్నారు.
కూటమి అభ్యర్థుల విజయం కోసం
ఇందుకోసం ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రత్యేకంగా బయల్దేరారు. ఈ పరిణామం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో వంగవీటి రాధా (Vangaveeti Radha) తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ కూటమి అభ్యర్థుల విజయం కోసం బలంగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. తనకు టికెట్ రాకపోయినా, రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ కూటమి అభ్యర్థులకు బలమైన మద్దతు ఇచ్చారు. దీనివల్ల ఆయన కూటమి పట్ల ఉన్న నిబద్ధతను స్పష్టంగా చాటుకున్నారు.

నారా లోకేశ్ నుంచి స్పష్టమైన హామీ
అయితే, ఎన్నికలు ముగిసి, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా వంగవీటి రాధాకు ఎలాంటి పదవి లభించకపోవడంపై ఆయన అనుచరుల్లో కొంత అసంతృప్తి నెలకొన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ పదవి లేదా మరో కీలక నామినేటెడ్ పదవిని వారు ఆశించారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న తాజా సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ భేటీలో వంగవీటి రాధా రాజకీయ భవిష్యత్తుపై నారా లోకేశ్ నుంచి స్పష్టమైన హామీ లభించవచ్చని ఆయన వర్గీయులు భావిస్తున్నారు. రాధాకు ఎలాంటి పదవి ఇవ్వబోతున్నారు? ఈ సమావేశంలో ఏయే అంశాలు చర్చకు రానున్నాయి? అనే విషయాలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఈ భేటీ తర్వాత రాధా రాజకీయ ప్రస్థానంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: