हिन्दी | Epaper

Latest News: MLA Sunitha మహిళలతో కలిసి ఆర్టీసి బస్సులో ఎమ్మెల్యే సునీత ప్రయాణం

Anusha
Latest News: MLA Sunitha మహిళలతో కలిసి ఆర్టీసి బస్సులో ఎమ్మెల్యే సునీత ప్రయాణం

అనంతపురం: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై – దుష్ప్రచారం చేసేందుకు జనంలోకి వస్తున్న వైసీపీ నాయకులకు చెంప చెల్లుమనిపించడం ఖాయమని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత (Paritala Sunitha) అన్నారు. స్త్రీ శక్తి పథకం ప్రారంభమైన వారం రోజులు గడుస్తున్న నేపథ్యంలో మహిళల స్పందన తెలుసుకునేందుకు గురువారం ఆమె ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. గొరిదిండ్ల గ్రామం నుంచి ఆత్మకూరు వరకు ఆమె మహిళలతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. ఎమ్మెల్యే సునీత కూడా జీరో ఫేర్ టికెట్ తీసుకున్నారు. అలాగే ఏ పని మీద ప్రయాణం చేస్తున్నారు. బస్సులో ఉచితంగా రావడం వలన మీకు ఎంత మేర డబ్బు ఆదాఅవుతోంది. ఈ పథకం రావడం వలన మీకు ఉపయోగం ఉందా.. ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా.. వంటి వాటి గురించి తెలుసుకున్నారు. మహిళల నుంచి ఈ పథకం పై మంచి స్పందన కనిపించింది.

Latest News
Latest News

ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు దృష్ట్యా స్త్రీ శక్తి పథకం (Women Shakti Scheme) అమలవుతుందా లేదా అనే అనుమానం చాలా మందికి ఉండేదన్నారు. కానీ మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం ఈ పథకాన్ని అమలు ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్నారన్నారు. దీనిపై మహిళల్లో కూడా చాలా సంతోషం వ్యక్తమవుతోందన్నారు. ఇప్పటికే 60లక్షల మందికి పైగా మహిళలు ప్రయాణం చేశారన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయణం విషయంలో ప్రజల నుంచి కొన్ని విజుప్తులు వస్తున్నాయన్నారు. కర్ణాటక ప్రాంతానికి వెళ్లే బస్సుల్లో ఏపీ బార్డర్ వరకు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పించాలన్నారు. అలా చేయకపోతే చాలా మందికి ఇబ్బంది ఏర్పడే పరిస్థితి ఉందని.. ఇప్పటికే ఈ విషయాన్ని రవాణాశాఖ మంత్రి, అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అన్నీ నెరవేరుస్తున్నట్టు చెప్పారు. పింఛన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా అందరికీ తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ ఇప్పుడు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటివి వరుసగా అమలు చేస్తున్నామన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/water-bulletins-released-in-all-districts-on-water-bulletin/andhra-pradesh/534245/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసులో ట్విస్ట్.. విచారణకు హాజరైన వీణ
0:19

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసులో ట్విస్ట్.. విచారణకు హాజరైన వీణ

ఏపీలో భారీగా పడిపోయిన కోడిగుడ్ల ధరలు

ఏపీలో భారీగా పడిపోయిన కోడిగుడ్ల ధరలు

యువ పార్లమెంట్ పోటీల్లో పద్మావతి వర్సిటీ విద్యార్థినుల విజయం

యువ పార్లమెంట్ పోటీల్లో పద్మావతి వర్సిటీ విద్యార్థినుల విజయం

శ్రీ కనక దుర్గమ్మ మహాకుంభాభిషేక మహోత్సవాలకు శ్రీకారం

శ్రీ కనక దుర్గమ్మ మహాకుంభాభిషేక మహోత్సవాలకు శ్రీకారం

కేంద్ర కేబినెట్‌లోకి జనసేన? ఏపీలోనూ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం!

కేంద్ర కేబినెట్‌లోకి జనసేన? ఏపీలోనూ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం!

ఏపీ లస్కర్ల వేతనాల్లో భారీ పెంపు

ఏపీ లస్కర్ల వేతనాల్లో భారీ పెంపు

జనావాసాలకు సురక్షిత మంచినీరు లక్ష్యం.. డి.సిఎం పవన్

జనావాసాలకు సురక్షిత మంచినీరు లక్ష్యం.. డి.సిఎం పవన్

ఏపీ హైకోర్టుకు తొలి మహిళా సీజేగా లీసా గిల్

ఏపీ హైకోర్టుకు తొలి మహిళా సీజేగా లీసా గిల్

మూడేళ్ల చిన్నారిపై యాసిడ్ దాడి!

మూడేళ్ల చిన్నారిపై యాసిడ్ దాడి!

కూటమి సర్కార్ మరో కీలక హామీలు అమలుకు సిద్ధం

కూటమి సర్కార్ మరో కీలక హామీలు అమలుకు సిద్ధం

సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యత: ఎస్పీ

సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యత: ఎస్పీ

సోషల్ మీడియా బ్యాన్: ఏపీ ప్రభుత్వంపై మంచు మనోజ్ ప్రశంసలు

సోషల్ మీడియా బ్యాన్: ఏపీ ప్రభుత్వంపై మంచు మనోజ్ ప్రశంసలు

📢 For Advertisement Booking: 98481 12870