हिन्दी | Epaper
బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

Latest News: AP Free Bus గ్రౌండ్ బుకింగ్ బస్సుల్లో కూడా ఫ్రీ జర్నీ

Anusha
Latest News: AP Free Bus గ్రౌండ్ బుకింగ్ బస్సుల్లో కూడా ఫ్రీ జర్నీ

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో భాగంగా, రాష్ట్ర మహిళలకు ప్రత్యేకంగా ఒక కీలక సంక్షేమ పథకాన్ని అందిస్తోంది. అదే “స్త్రీశక్తి” పథకం. ఈ పథకం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సు (RTC bus) ల్లో మహిళలకు పూర్తిగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం అయిన ఆగస్టు 15, 2025 నుండి ఈ పథకం అధికారికంగా అమలులోకి వచ్చింది.స్త్రీశక్తి పథకం ప్రధాన ఉద్దేశ్యం రాష్ట్రంలోని మహిళలకు ఆర్థిక భారం తగ్గించడం, సామాజిక భద్రత కల్పించడం. ఉద్యోగం, విద్య, వ్యాపారం, రోజువారీ పనుల కోసం ప్రయాణించే మహిళలు ఇకపై బస్సు ఛార్జీల గురించి ఆందోళన చెందనవసరం లేదు. ఈ విధంగా మహిళలు స్వేచ్ఛగా, ధైర్యంగా రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా వెళ్లే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది.

ఏ బస్సుల్లో ఉచిత ప్రయాణం?

ఇప్పటికే పలు జిల్లాల్లో ఈ పథకం విజయవంతంగా కొనసాగుతోంది. అయితే తాజాగా అధికారులు కీలక అలర్ట్ విడుదల చేశారు. దాని ప్రకారం, ఇప్పటి వరకు పల్లె, ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల్లోనే మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తోన్నా, ఇకపై సిటీ సర్వీసులు, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. దీంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళలు సమానంగా ఈ పథకాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది.కూటమి ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది. ఇకపై వారికి గ్రౌండ్ బుకింగ్ (Ground booking) ఉన్న బస్సుల్లో కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించబోతున్నట్లు వెల్లడించింది.గ్రౌండ్ బుకింగ్ బస్సులంటే.. కొన్ని ప్రత్యేక బస్సుల్లో కండక్టర్లు ఉండరు.. అలానే ఇవి 2, 3 స్టాపుల్లో మాత్రమే ఆగుతాయి. వీటికి ఆయా బస్టాండ్లలో మాత్రమే టికెట్ జారీ చేస్తారు. ఈ క్రమంలో ప్రభుత్వం.. ఇలాంటి బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబోతున్నట్లు తెలిపింది.

Latest News
Latest News

ఫీజు మినహాయించాలని కోరుతూ ఆర్టీసీ అధికారులు

గ్రౌండ్ బుకింగ్ కింద నడిపే పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కూడా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. వీటిల్లో కూడా మహిళలకు ఉచిత బస్సు పథకం వర్తిస్తుందని అధికారులు తెలిపారు. అలానే సింహాచలం కొండపైకి వెళ్లే సిటీ బస్సులకు టోల్ ఫీజు మినహాయించాలని కోరుతూ ఆర్టీసీ అధికారులు దేవస్థానం ఈవోకు లేఖ రాశారు. రాష్ట్రంలో తిరుమల మినహా మిగతా 39 ఘాట్ రోడ్లపై తిరిగే బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇదిలా ఉండగా, బొబ్బిలి నుంచి విశాఖపట్నం వెళ్తున్న బస్సులో ఇద్దరు ప్రయాణికులు సీటు విషయంలో బూతులు తిట్టుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/nadendla-manohar-ysrcp-misinformation-alliance/andhra-pradesh/538738/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870