గుంటూరు జిల్లా తురకపాలె గ్రామం (Turakapalem) లో గత నాలుగు నెలల్లో చోటుచేసుకున్న అనుకోని మరణాలు స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనల్లోకి నెట్టింది. కేవలం జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మొదటి వారంలో కలిపి 40 మందికి పైగా గ్రామస్తులు ప్రాణాలు కోల్పోవడం, ఈ సమస్య తీవ్రతను స్పష్టంగా చూపిస్తోంది. వీరిలో చాలామంది జ్వరం, దగ్గు, ఆయాసం వంటి లక్షణాలతో స్థానిక ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందినప్పటికీ, తిరిగి ఇంటికి చేరలేక మరణించడమంటే స్థానికులకు ఆందోళన ఇంకా పెంచింది.
గ్రామంలో కొనసాగుతున్న ఈ అనిశ్చిత పరిస్థితి తక్షణమే దర్యాప్తు అవసరాన్ని ప్రేరేపించింది. దీంతో ఈ బుధవారం (సెప్టెంబర్ 10) ఐసీఎంఆర్ బృందం తురకపాలలెంలో పర్యటనుందని అధికారులు తెలిపారు. గతంలో కూడా ఈ సమస్యపై వివిధ జాతీయ స్థాయి సంస్థలు గ్రామానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించాయి. ఎయిమ్స్, ఐసిఎఆర్, NCDC, NHC వంటి సెంటర్ల బృందాలు శాంపిల్స్ సేకరించి, మరణాల కారణాలను పరిశీలించడం ప్రారంభించారు.
క్రమ క్రమంగా వీడుతున్న మరణాల మిస్టరీ
బ్యాక్టీరియా కారణంగానే చనిపోయారంటున్న ఎమ్మెల్యే బూర్ల రామాంజినేయులు. క్రమ క్రమంగా వీడుతున్న మరణాల మిస్టరీ. జాతీయ స్థాయి సంస్థల నివేదిక (Report of National Level Institutions) మరింత స్పష్టత వస్తుందని ఎమ్మెల్యే అన్నారు. దీంతో ఆందోళన నుండి స్థానికులు బయటపడుతున్నారు.కాగా కేవలం 4 నెలల వ్యవధిలో 40 మంది గ్రామస్తులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర భయాందోళనలు సృష్టించింది. జూలైలో 10 మరణాలు, ఆగస్టులో 10 మరణాలు, సెప్టెంబర్ ప్రారంభంలో మూడు మరణాలు సంభవించాయి. జ్వరం, దగ్గు, ఆయాసంతో ఆసుపత్రుల్లో చేరిన వారు తిరిగి ఇంటికి రావడం లేదు.

కలుషిత భూగర్భ జలాలు అనారోగ్యానికి దారితీస్తునట్లు
చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక ఇంట్లో అంత్యక్రియలు పూర్తయ్యేలోపే మరో ఇంట్లో ఇంకొకరు చనిపోతున్నారు. ముఖ్యంగా 1200 మంది నివాసం ఉంటున్న ఎస్సీ కాలనీలోనే ఎక్కువగా మరణాలు నమోదు కావడంతో మూఢనమ్మకాలకు దారితీస్తుంది. గ్రామంలో ఇటీవల ఏర్పాటుచేసిన బొడ్రాయే ఈ మరణాలకు కారణమని స్థానికులు భావిస్తున్నారు. అయితే స్థానిక ఎమ్మెల్యే రామాంజనేయులు ఆదేశాలతో వైద్య ఆరోగ్య శాఖ రంగంలోకి దిగింది. ఎస్సీ కాలనీలో పారిశుధ్య లోపం, క్వారీ కాలుష్యం, కలుషిత భూగర్భ జలాలు అనారోగ్యానికి దారితీస్తునట్లు వైద్య బృందం ప్రాథమికంగా గుర్తించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు జాతీయ సంస్థల నివేదికలు వెల్లడించిన తర్వాతే తెలిసే అవకాశం ఉంది.
Read hindi news:hindi.vaartha.com
Read Also: