हिन्दी | Epaper
ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Kurnool Bus Accident : కర్నూల్ బస్సు ప్రమాదం.. 27మందిపై కేసు నమోదు

Sudheer
Kurnool Bus Accident : కర్నూల్ బస్సు ప్రమాదం.. 27మందిపై కేసు నమోదు

కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల రాష్ట్ర ప్రజలు విచారం వ్యక్తం చేసినప్పటికీ, ఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం ప్రచారం చేసిన వారిపై పోలీసులు చర్యలు ప్రారంభించారు. కర్నూలు రూరల్ మండలంలోని తాండ్రపాడు గ్రామానికి చెందిన వేణుములయ్య అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు మొత్తం 27 మందిపై కేసు నమోదు చేశారు. ఈ జాబితాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక X (ట్విటర్) పేజీ నిర్వాహకులు, ప్రముఖ యాంకర్ శ్యామల, రాజకీయ విశ్లేషకుడు సీవీ రెడ్డి, జర్నలిస్ట్ కందూరి గోపీకృష్ణ వంటి పేర్లు ఉన్నాయని సమాచారం.

Allu Sirish Engagement : అట్టహాసంగా అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్

ఫిర్యాదుదారుడు వేణుములయ్య పోలీసులకు అందజేసిన వివరాల ప్రకారం, బస్సు ప్రమాదానికి నిజమైన కారణం డ్రైవర్ నిర్లక్ష్యం, మెకానికల్ లోపం అని నిర్ధారణ అయినప్పటికీ, సోషల్ మీడియాలో కొందరు ఉద్దేశపూర్వకంగా “కల్తీ మద్యం” మరియు “బెల్టుషాపుల” అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం ప్రతిష్ఠను దెబ్బతీసేలా పోస్టులు పెట్టారని పేర్కొన్నారు. ఈ పోస్టులు ప్రజల్లో గందరగోళం సృష్టించి, ప్రభుత్వంపై అవిశ్వాసం కలిగించేలా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో పోలీసులు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి, సంబంధిత అకౌంట్లను పరిశీలిస్తున్నారు.

karnool

ఇక ఈ వ్యవహారంపై రాజకీయ వాతావరణం వేడెక్కింది. వైసీపీ వర్గాలు తమపై జరుగుతున్న చర్యలను రాజకీయ ప్రతీకారంగా అభివర్ణిస్తుండగా, అధికార పక్షం మాత్రం “తప్పుడు ప్రచారానికి అడ్డుకట్ట వేయడం” తప్ప మరేదీ కాదని స్పష్టం చేస్తోంది. సోషల్ మీడియా వేదికలను ఉపయోగించి అసత్య సమాచారం వ్యాప్తి చేయడం ఇప్పుడు తీవ్రమైన నేరంగా పరిగణించబడుతున్న నేపథ్యంలో, ఈ కేసు భవిష్యత్తులో రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, సోషల్ మీడియా యాక్టివిస్టుల కార్యకలాపాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870