విజయవాడ : కార్తీకమాసం సందర్భంగా పర్యా టక శాఖ ఆధ్వర్యంలో పంచా రామాలకు ప్రత్యేక టూర్ ప్యాకేజీ ఏర్పాటు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవ లప్మెంట్ కార్పొరేషన్ డివిజ నల్ మేనేజర్ కృష్ణ చైతన్య(Krishna Chaitanya) శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. భక్తి, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందిన కార్తీక మాసం శుభసందర్భంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రత్యేక పంచారామాల టూర్(Pancharamala Tour) ప్యాకేజీని ప్రకటించటం జరిగిందన్నారు.
Read Also: Kancharla Srikanth: ఉద్యోగులకు అండగా కూటమి ప్రభుత్వం – సిఎం, డిసిఎం చిత్రాలకు పాలాభిషేకం

పంచారామాలు (ఐదు పురాతన శివాలయాలు) గొప్ప మత, సాంస్కృతిక వారసత్వాన్ని సూచిస్తాయని, కార్తీక మాసంలో ఈ దేవాలయాలను సందర్శించడం(Krishna Chaitanya) అపారమైన దైవిక ఆశీర్వాదాలను ఇస్తుందని భక్తులు నమ్ముతారన్నారన్నారు. భక్తులకు సురక్షిత, సౌకర్యవంతమైన మరియు ఆధ్యాత్మిక, సంతృప్తికర తీర్థయాత్రను అందించడానికి పర్యాటక శాఖ ప్రత్యేక టూర్ ప్యాకేజీలో శ్రీ అమర లింగేశ్వర స్వామి అమరావతి, సోమేశ్వర స్వామి భీమవరం, క్షీరా రామలింగేశ్వర స్వామి పాల కొల్లు, భీమేశ్వర స్వామి ద్రాక్షారామం, కుమార రామ స్వామి, సామర్లకోట పంచా రామ క్షేత్రాలు ఉన్నాయ న్నారు. కార్తీకమాసంలో ప్రతి సోమవారం విజయ వాడలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న టూరిజం కేంద్ర రిజర్వేషన్ కార్యాలయం నుండి ఈ నెల అక్టోబర్ 27, నవంబర్ 3, నవంబర్ 10, నవంబర్ 17 సోమవారం తేదీల్లో బస్సులు బయలుదేరతాయన్నారు. పెద్దలకు: రూ.2130/, పిల్లలు: రూ.1760 ధర ఉంటుందన్నారు. వీటితోపాటు ప్రతి శనివారం విజయవాడ నుండి వాడపల్లి వరకు ప్యాకేజీ టూర్ను పర్యాటక శాఖ నిర్వహిస్తోందన్నారు. బుకింగ్ల కోసం, 2 2 98480 07025, 84990 54422, 1800 42545454 ລ້ డివిజనల్ మేనేజర్ కృష్ణ చైతన్య ఆ ప్రకటనలో తెలియజేశారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also: