విరాళంగా 20 టన్నుల కూరగాయాలు
Kanipakam: కాణిపాకం శ్రీవరసిద్ది వినాయకస్వామివారి దేవస్థానం. ప్రధాన ఆలయం, అనుబంధ ఆలయమైన శ్రీమరగదాంభిగా సమేత మణికంఠేశ్వరాయలంలు ఆషాడ పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి జరుగనున్న శాకాంబరి అలంకారంకు ముస్తాబయ్యాయి. 2022 నుండి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీమనికంఠేశ్వరాలయంలో (Srimanikantheshwara Temple) శ్రీమరగదాంభిగా దేవి, దుర్గాదేవిలకు వివిధ రకాల కూరగాయలు, పండ్లుతో శాకాంబరి అలంకారంను నిర్వహిస్తున్నారు. ఈఏడాది ప్రధాన ఆలయంలో కూడా శాకాంబరి అలంకారం నిర్వహించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. ఈమేరకు అలంకరణకు అవసరమైన కూరగాయలను (vegetables) భక్తులు ఉచితంగా సమర్పించాలన్న విజ్రుప్తితో భక్తులు వారికి తోచిన విధంగా వివిధ రకాల కూరగాయలు, పండ్లును విరాళంగా దేవస్థానంకు అందజేశారు. దీనితో పలమనేరు, కర్నాటక రాష్ట్రం వడ్డేపల్లె, కోలారు, ముళబాగళ్, బెంగుళూరు, తమిళనాడు రాష్ట్రం హొసూరు ప్రాంతాలలోని కూరగాయల మార్కెట్ యజమానుల నుండి విరాళంగా అందజేసిన వివిధ రకాల కూరగాయలు, పండ్లు, కరివేపాకులతో ప్రధాన ఆలయం, మణికంఠేశ్వ రాలయంలను సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు. ఈఆలయాల ప్రాంగణం మొత్తాన్ని కూరగాయలు, పండ్లుతో అలంకరిస్తున్నారు. వేకువ జామున అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించిన అనంతరం కూరగాయలు, పండ్లుతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించనున్నారు.
కాణిపాకం చరిత్ర?
కాణిపాకం (Kanipakam) గణేష్ ఆలయం 11వ శతాబ్దం ప్రారంభంలో చోళ రాజు కులోత్తుంగ చోళ I చే స్థాపించబడింది మరియు తరువాత 1336లో విజయనగర రాజవంశ చక్రవర్తులచే మరింత అభివృద్ధి చేయబడింది . కాణిపాకం ఆలయం వినాయక (గణేశ) పవిత్ర స్థలాలలో ఒకటి మరియు దీనిని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం అని కూడా పిలుస్తారు.
కాణిపాకం దేవుడు ఎవరు?
కాణిపాకం గణేష్ ఆలయం 11వ శతాబ్దం ప్రారంభంలో చోళ రాజు కులోత్తుంగ చోళ I చే స్థాపించబడింది మరియు తరువాత 1336లో విజయనగర రాజవంశ చక్రవర్తులచే మరింత అభివృద్ధి చేయబడింది . కాణిపాకం ఆలయం వినాయక (గణేశ) పవిత్ర స్థలాలలో ఒకటి మరియు దీనిని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం అని కూడా పిలుస్తారు.
కాణిపాకం అద్భుతాలు?
ఈ స్వయంభువైన గణేశ విగ్రహం, అది కనుగొనబడిన ప్రదేశంలోనే, ఎప్పుడూ ఎండిపోని బావిలో ఇప్పటికీ ఉంది. సోదరుల అద్భుత స్వస్థత మరియు విగ్రహం యొక్క దైవిక ఆవిర్భావం కాణిపాకం వినాయక స్వామి ఆలయంలో దైవత్వం యొక్క అసాధారణ ఉనికిని సూచిస్తాయి.
Read hindi news: hindi.vaartha.com
Read also: Chandra babu: ప్రజల సేవ కోసమే టెక్నాలజీ