Kakinada Firecracker Blast: కాకినాడ జిల్లా సదాశివపేట మండలం వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘటనలో విషాదం కొనసాగుతోంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి (GGH)లో చికిత్స పొందుతున్న వీర శ్రీను (39) బుధవారం మరణించారు. మంగళవారం ఇదే ఆసుపత్రిలో లోవరాజు అనే వ్యక్తి మరణించిన సంగతి తెలిసిందే. తాజా మరణంతో ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 25కు చేరుకుంది.
Read Also: Andhra Pradesh: రెండు కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన ఏపీ శాసనమండలి

క్షతగాత్రుల పరిస్థితి విషమం
శనివారం (ఫిబ్రవరి 28) జరిగిన ఈ పేలుడులో 20 మంది అక్కడికక్కడే సజీవ దహనం కాగా, మిగిలిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒక్కొక్కరుగా కన్నుమూస్తున్నారు. ప్రస్తుతం మరో ఐదుగురు క్షతగాత్రులు జిజిహెచ్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో మెజారిటీ బాధితులకు 90 శాతం కంటే ఎక్కువ కాలిన గాయాలవ్వడంతో వారి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. బాధితులను కాపాడేందుకు వైద్య బృందం శాయశక్తులా కృషి చేస్తోంది.
గ్రామంలో మిన్నంటిన రోదనలు
ఒకే ప్రమాదంలో ఇంతమంది ప్రాణాలు కోల్పోవడంతో వేట్లపాలెం మరియు సమీప గ్రామాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ప్రభుత్వం ఇప్పటికే మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. నిబంధనలకు విరుద్ధంగా భారీస్థాయిలో పేలుడు పదార్థాలు నిల్వ ఉంచడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు అధికారులను ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: