Janasena Party: జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. సమాజంలోని అన్ని వర్గాలను ఆకర్షించడంతో పాటు, పార్టీ శ్రేణులలో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు.
Read Also:AP: ఏపీకి వస్తున్న బిల్ గేట్స్..చంద్రబాబుతో భేటీ

ఆర్ఎస్ఎస్ తరహాలో కొత్త వర్గీకరణ
పార్టీ కేడర్ను మరింత క్రమశిక్షణతో మరియు ఒక లక్ష్యంతో నడిపించేందుకు, ఆర్ఎస్ఎస్ (RSS) పదాధికారుల తరహాలో కొత్త పేర్లను పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టారు. ఈ నిర్ణయం పార్టీలో కొత్త చర్చకు దారితీసింది.
మూడు విభాగాలుగా జనసైనికులు
పార్టీ కార్యకర్తలను, నాయకులను మూడు ప్రత్యేక బృందాలుగా పవన్ వర్గీకరించారు. వారు నిర్వహించే బాధ్యతలను బట్టి ఇకపై ఈ క్రింది పేర్లతో పిలవబడతారు:
- ఉద్యమి: క్షేత్రస్థాయిలో పార్టీ కోసం కష్టపడేవారు.
- సాధక్: పార్టీ విధానాలను సాధన చేస్తూ ముందుకు తీసుకెళ్లేవారు.
- ప్రదాత: పార్టీకి సేవలు, సహకారం అందించేవారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: