हिन्दी | Epaper
రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

Telugu News: Atchannaidu: అరటి రైతుల పేరుతో మళ్లీ మోసగిస్తున్న జగన్

Tejaswini Y
Telugu News: Atchannaidu: అరటి రైతుల పేరుతో మళ్లీ మోసగిస్తున్న జగన్

కడప(kadapa) జిల్లాలో అరటి రైతుల పేరుతో మళ్లీ అబద్ధాల ప్రచారం ప్రారంభించిన జగన్ తీరు ప్రజలను మోసం చేసే మరో ప్రయత్నమే తప్ప వాస్తవాలతో ఎలాంటి సంబంధంలేదని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు(Atchannaidu) అన్నారు. ఐదేళ్ల పాటు వ్యవసాయ రంగాన్ని అధ్వాన్న స్థితికి నెట్టిన జగన్ ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం కామెడీగా ఉందన్నారు. జగన్ పాలనలోనే రైతులు వీధులపైకి వచ్చారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ అంటే ఏమిటో ఆయన ప్రభుత్వానికి తెలియదు.

రైతులను ఆదుకోవాల్సిన ఆర్బీకేలను లంచాల గూళ్లుగా మార్చి అరటి(Banana), టమోటా(Tomato), ఉల్లి వంటి పంటలను నేలమట్టం చేసిన ప్రభుత్వం జగన్దే అని మండిపడ్డారు. గత ఐదేళ్ల పాలనలో రైతులు కన్నీళ్లు పెట్టుకుని, ఎంత క్షోభకుగురయ్యారన్న విషయాన్ని గుర్తుచేసుకోవాలని అన్నారు. ఎగుమతుల పేరుతో జగన్ చెబుతున్న సంఖ్యలన్నీ వంద శాతం అబద్ధం. తన హయాంలో 3 లక్షల టన్నులు ఎగుమతి చేశామని చెప్పడం పూర్తిగా కల్పితం.

Read Also: Nara Lokesh: విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి: మంత్రి లోకేష్

Jagan is deceiving again in the name of banana farmers Atchannaidu

ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు

కేంద్రం నుంచి అవార్డులు తీసుకువచ్చామన్న మాటకే ఎలాంటి రికార్డు లేదు. ఇదంతా జగన్ ప్రచార బృందం తయారు చేసిన అబద్ధాల మేళా మాత్రమే అని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో 2020-25 ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ(Food Processing Policy) పరిధికి సంబంధించి మొదటి దశలో 10 యూనిట్ల కోసం ప్రభుత్వం రూ.1250.29 కోట్ల పరిపాలనా ఆమోదం కూడా జారీ చేసినట్లు మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. రూ.2,500 కోట్లతో ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేశామనేది కూడా పూర్తిగా అవాస్తవమే. పత్రాల్లో మాత్రమే ప్రాజెక్టులు(projects), నేలపై ఒక్క అడుగు కూడా ముందుకు వేయని ప్రభుత్వం తమ పాలనను గొప్పగా చెప్పుకోవడం హాస్యాస్పదం అని అన్నారు.

కూటమి ప్రభుత్వంపై నిందలు మోపే ముందు, ఆయన తన ఐదు సంవత్సరాల పాలనలో రైతులు అనుభవించిన నష్టాలను ఒకసారి వెనక్కి చూసుకో వాలి. ఈ ఏడాది రాయలసీమలో కడప,
నంద్యాల, అనంతపురం జిల్లాలలో మొత్తం 40,000 హెక్టార్లలో అరటి సాగు జరిగింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 20 శాతం ఎక్కువ. రైతులు(Farmers) ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకొని సాగు విస్తరిం చారు. ధరలు తగ్గడానికి కారణాలు అధిక వర్షాల వల్ల నాణ్యత తగ్గడం, ఉత్తరాది రాష్ట్రాలలో సాగు విస్తరణ, రెండో కోతపంట ఎగుమతులకు అనువు గాకపోవడం వంటి సహజ మార్కెట్ పరిస్థితులు. కానీ జగన్ ఇవన్నింటిని దాటికి పూర్తిగా రాజకీయ దాడులు చేయడం రైతులను ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించడమే.

పంటనాణ్యత సమస్యల వల్ల ఎగుమతు

ప్రస్తుతం ఉత్తమ నాణ్యత గల అరటికాయకు కిలో రూ.7.50 నుండి రూ.8.00వరకు ధర రావడం, నాణ్యతలేని పంట టన్నుకు రూ.3,000 నుండి రూ.8,000 మధ్య పడటం సహజమే. రెండో కోతలో ఉన్న 17,000 హెక్టార్లలో పంటనాణ్యత సమస్యల వల్ల ఎగుమతు లకు అనుకూలంగాలేదు. అయినా కూడా ప్రభుత్వం రైతులకు మంచి ధర కల్పించేం దుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు జగన్ చెబుతున్న మా హయాంలో 3 లక్షల టన్నులు ఎగుమతి చేశాం వంటి గణాంకాలు పూర్తిగా అబద్ధం. ప్రస్తుతం గడచిన రెండు నెలల్లో రోజుకు 700-800 టన్నులే ఎగుమతి అవుతున్నాయి. కేంద్రం నుంచి అవార్డులు తీసుకొచ్చామన్న మాటలకు ఎటువంటి రికార్డులు లేవు. బహిరంగ మార్కెట్ లో రులు లేవు. అంతర్జాతీయ అంశాలతో ముడిపడి ఉన్న పంటలకు ధర పెరిగితే మా వలనే పెరిగిందని మాట్లాడుతున్న అవగాహన లేని మాజీ సీఎం జగన్ అని ఎద్దేవా చేశారు.

రైతులు తీవ్ర నష్టాలు

గత ప్రభుత్వ పాలనలో ఖరీఫ్ 2019 తర్వాత స్వంత బీమా సంస్థతో పంట బీమా అమలు చేయాలనుకున్న ప్రయత్నం విఫలమై, రబీ 2018-19 తర్వాత ఏ రబీ సీజన్ కూ బీమా పరిహారం చెల్లించకపోవడం వల్ల రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొన్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకున్న తర్వాత పథకాల సమర్థవంతమైన అమలు, పర్యవేక్షణ కోసం వ్యవసాయ, ఆర్థిక, పౌర సరఫరాల మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి, ఖరీఫ్ 2024లో ఈపంట ఆధారంగా ఉచిత పంట బీమాను అమలు చేయడంతో పాటు రబీ 2024-25 నుంచి స్వచ్చంద నమోదు విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం రైతులకు సహాయపడేందుకు బలమైన చర్యలు చేపట్టింది.

రాష్ట్ర ఉద్యాన శాఖ ‘ఫ్రూట్ కేర్(Fruit Care)’ యాక్టివిటీ చేపడుతున్న ప్రతి రైతుకు ఎకరాకు రూ.10,000/ చొప్పున రాయితీ ప్రోత్సాహకాలు అందిస్తోంది. నాణ్యమైన పంట పెంచేందుకు శిక్షణ కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తోంది. ఉద్యానశాఖ జాయింట్ డైరెక్టర్ స్వయంగా అనంతపురం, నంద్యాల, కడప జిల్లాలలో పర్యటించి పంట పరిస్థితిని సమీక్షించారు. ప్రభుత్వ ప్రతినిధులు ఢీల్లీలో బయ్యర్ అండ్ సెల్లర్స్ మీట్నిర్వహించి దేశంలోని ప్రధాన మార్కెట్లతో ప్రత్యక్ష చర్చలు జరిపారు. ఆజాద్పూర్ మండి, హర్యానా సోనిపట్ అగ్రిగేటర్లతో జరిగిన సమావేశాల్లో వచ్చే 10-15 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కొనుగోలు ప్రారంభమవుతుందని కొనుగోలుదారులు హామీ ఇచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ ర్యాలీ గుంటూరులో, యువతకు ఛాన్స్!

ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ ర్యాలీ గుంటూరులో, యువతకు ఛాన్స్!

ఏపీలో 24 గంటల పోస్టల్ సేవలు, రాత్రికీ పార్శిల్ బుకింగ్!

ఏపీలో 24 గంటల పోస్టల్ సేవలు, రాత్రికీ పార్శిల్ బుకింగ్!

నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

అనాథ పిల్లలకు వరం ‘మిషన్ వాత్సల్య’

అనాథ పిల్లలకు వరం ‘మిషన్ వాత్సల్య’

దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల

జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల

పన్నుల వసూళ్లలో వెనుకబడితే షోకాజ్ నోటీసులే.. డీపీఓ వార్నింగ్.

పన్నుల వసూళ్లలో వెనుకబడితే షోకాజ్ నోటీసులే.. డీపీఓ వార్నింగ్.

కనుపర్తిపాడు హైస్కూల్‌లో సోలార్ పవర్ ప్రారంభించిన సెంట్రల్ టాక్స్ కమీషనర్

కనుపర్తిపాడు హైస్కూల్‌లో సోలార్ పవర్ ప్రారంభించిన సెంట్రల్ టాక్స్ కమీషనర్

రేపు నెల్లూరులో ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పర్యటన

రేపు నెల్లూరులో ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పర్యటన

వాణిజ్య ఒప్పందాల వల్ల ఎవరికి లాభం?

వాణిజ్య ఒప్పందాల వల్ల ఎవరికి లాభం?

తిరుపతి జిల్లా అభివృద్ధి ప్రాజెక్టుల వేగవంతానికి కలెక్టర్ ఆదేశం

తిరుపతి జిల్లా అభివృద్ధి ప్రాజెక్టుల వేగవంతానికి కలెక్టర్ ఆదేశం

భువన మృతి.. హత్య లేక ఆత్మహత్య?

భువన మృతి.. హత్య లేక ఆత్మహత్య?

📢 For Advertisement Booking: 98481 12870