ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సరళిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ఘాటు విమర్శలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. అసెంబ్లీలో జరుగుతున్న చర్చలు ప్రజా సమస్యలను పక్కనపెట్టి, కేవలం ఒకరినొకరు పొగుడుకోవడానికే పరిమితమయ్యాయని
అసెంబ్లీ సమావేశాలు కేవలం “ఆత్మస్తుతి, పరనింద” (తమను తాము పొగుడుకోవడం, ఇతరులను దూషించడం) అన్నట్లుగా సాగుతున్నాయని జగన్ మండిపడ్డారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, మరియు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒకరినొకరు అతిగా పొగుడుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. “చంద్రబాబు తన కొడుకును జాకీ పెట్టి లేపుతుంటే, లోకేష్ తన తండ్రిని లేపుతున్నారని, వీరిద్దరినీ పవన్ కళ్యాణ్ మోస్తున్నారని” ఎద్దేవా చేశారు. సభలో ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సింది పోయి, కేవలం అధికార పక్షం తమను తాము డబ్బా కొట్టుకోవడానికే సమయాన్ని వృధా చేస్తోందని ఆయన విమర్శించారు.
Read Also : ICC T20: టీ20 ర్యాంకింగ్స్లో భారత్ జోరు.. టాప్ 2 మనోళ్లే
రాష్ట్రంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే, ప్రభుత్వం మాత్రం అసెంబ్లీ వేదికగా ఆటల పోటీలు, స్కిట్లు నిర్వహిస్తూ కాలక్షేపం చేస్తోందని జగన్ ధ్వజమెత్తారు. ప్రజల కష్టాలను పట్టించుకోకుండా ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని, అసెంబ్లీ సెషన్ అంతా తప్పుడు ప్రచారాలతో నిండిపోయిందని ఆరోపించారు. కీలకమైన అంశాలపై చర్చించకుండా కేవలం వైసిపిపై బురద చల్లడమే లక్ష్యంగా అధికార పక్షం పనిచేస్తోందని ఆయన వాపోయారు. అసెంబ్లీలో జరుగుతున్న ఈ పరిణామాలు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని జగన్ హెచ్చరించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :