Indrakeeladri: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే మహా కుంభాభిషేక వేడుకలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. శుక్రవారం శాస్త్రోక్తంగా ప్రారంభమైన ఈ మూడు రోజుల క్రతువు నేటితో (ఆదివారం) ముగియనుంది. ఆలయ పండితులు, అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది.
Read Also: Nellore District Crime Review: స్మార్ట్ పోలీసింగ్తో నేరాలకు అడ్డుకట్ట:అజిత వేజెండ్ల
బంగారు కలశానికి అభిషేకం.. తరలిరానున్న భక్తులు
ఈ వేడుకల్లో అత్యంత కీలకమైన ఘట్టం ఈరోజు ఆవిష్కృతం కానుంది. ఆలయ విమాన గోపురంపై ఉన్న బంగారు కలశానికి పండితులు మహాకుంభాభిషేకం నిర్వహించనున్నారు. ఈ క్రతువును వీక్షించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.

ముఖ్యఅతిథిగా సీఎం చంద్రబాబు..
ఈ చారిత్రక ఆధ్యాత్మిక వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. విమాన గోపుర కలశాభిషేక ప్రధాన ఘట్టంలో ఆయన పాల్గొని, అమ్మవారిని దర్శించుకోనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో విజయవాడలో, ఆలయ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: