Telugu News: Hidma Encounter: పోస్టుమార్టం ఆలస్యం: మార్చురీలోనే 9 మావోయిస్టుల మృతదేహాలు

Read Time:  1 min
Hidma Encounter
Hidma Encounter
FONT SIZE
GET APP

మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్లలో(Hidma Encounter) ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టుల పోస్టుమార్టం ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. మొత్తం 13 మంది మావోయిస్టులు మృతి చెందగా, వారిలో తొమ్మిది మందికి సంబంధించిన మృతదేహాలు రంపచోడవరం ఏరియా ఆసుపత్రి మార్చురీలోనే ఉంచబడ్డాయి. ఇటీవలి రెండు ఎన్‌కౌంటర్లలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా 13 మంది మరణించారు. వీరిలో ఇప్పటివరకు హిడ్మా,(Hidma Encounter) అతని భార్య, టెక్ శంకర్, దేవే మృతదేహాల పోస్టుమార్టం పూర్తిచేసి కుటుంబాలకు అందజేశారు. టెక్ శంకర్ మృతదేహాన్ని ఆయన బంధువులు నిన్న శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు నుంచి తీసుకెళ్లారు.

Read Also:  KTR: ప్రైవేటుల లాభానికే ఫార్ములా–ఈ కుట్ర: ఏసీబీ సంచలనం

Hidma Encounter
Postmortem delayed: Bodies of 9 Maoists found in morgue

ఛత్తీస్‌గఢ్ బంధువుల రాక కోసం ఎదురు

మిగిలిన 12 మంది మృతులూ ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారే కావడంతో అక్కడి నుంచి కుటుంబ సభ్యులు రంపచోడవరం చేరుకోవాల్సి ఉంది. సుదూర గ్రామాల నుంచి రాకలో ఆలస్యం జరుగుతుండటంతో పోస్టుమార్టం ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఇప్పటికే కొందరు బంధువులు ఆసుపత్రి వద్దకు చేరుకుని మృతదేహాలను తీసుకెళ్లేందుకు వేచి చూస్తున్నారు. అందరూ చేరిన తరువాత మిగిలిన మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబాలకు అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.