News Telugu: Gunturu: ఏపీ లోని ఆ జిల్లాలో బైపాస్ వెళ్లే పట్టణాలకు మహర్దశ..

Read Time:  1 min
A great opportunity for the towns that are going to bypass in that district of AP..
A great opportunity for the towns that are going to bypass in that district of AP..
FONT SIZE
GET APP

గుంటూరు (Guntur) జిల్లాలోని దాచేపల్లి మాచర్ల జాతీయ రహదారి 167AD వెంబడి ఉన్న గురజాల, మాచర్ల, రెంటచింతల పట్టణాలకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త ఇచ్చింది. ఈ పట్టణాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు, రోడ్లు మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు NHAI రూ.50 కోట్ల నిధులు కేటాయించింది. ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమవగా, త్వరలోనే పనులు ప్రారంభించేందుకు అధికారులు రెడీ అవుతున్నారు.

Read also: Nara lokesh: పుట్టపర్తిలో 74వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి లోకేశ్‌

A great opportunity for the towns that are going to bypass in that district of AP..

A great opportunity for the towns .

Gunturu: కొత్తగా నిర్మించిన బైపాస్ మార్గాలతోపాటు, పట్టణాల మధ్య ప్రధాన రహదారులను మరింత విస్తరించనున్నారు. రోడ్లకు ఇరువైపులా డ్రెయిన్లు, సైడ్ పాత్‌లు నిర్మించడం ద్వారా ట్రాఫిక్ వ్యవస్థ మొత్తం మెరుగుపడనుంది. తొమ్మిది నెలల్లో ఈ పనులన్నీ పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్ణయించారు.

ఏ పట్టణంలో ఏమేం పనులు?

మాచర్ల
సుమారు 4.9 కిమీ రోడ్డును ఇరువైపులా 10 అడుగుల మేర విస్తరించనున్నారు. రహదారికి రెండు వైపులా కొత్త డ్రెయిన్లు కూడా నిర్మించబడతాయి.

రెంటచింతల
4 కిమీ ప్రధాన మార్గాన్ని 15 అడుగుల మేర విస్తరిస్తారు. అవసరమైన ప్రాంతాల్లో సుమారు 500 మీటర్ల డ్రెయిన్ నిర్మాణం ఉంటుంది.

గురజాల
ప్రస్తుతం ఉన్న 4-లైన్ రోడ్డు 4.2 కిమీల మేర మరింత విస్తరించబడుతుంది. ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించేందుకు కొత్త డ్రెయిన్లు, సైడ్ విస్తరణ చేపడతారు. ఈ పనులు పూర్తవడంతో బైపాస్ మార్గాలు, పట్టణ కేంద్రాలు మరింత సులువు రవాణా సదుపాయాలతో మారబోతున్నాయి. స్థానికులకు, వాహనదారులకు, వాణిజ్య రవాణాకు పెద్దగానే లాభం చేకూరనుంది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.