విజయవాడ : అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ (ఏక్యూసీసీ)లో ఐబీఎం క్వాంటం కంప్యూటర్ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) ఉత్తర్వులు జారీచేసింది.
అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుపై ఇప్పటికే 50 ఎకరాలు కేటాయించింది సీఆర్డీఏ. ప్రభుత్వ సంస్థగా అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ (ఏక్యూసీసీ) ఏర్పాటు చేసింది వివిధ రంగాల్లో పరిశోధనలు, యూనివర్సిటీలు, స్టార్టప్లు, పరిశ్రమలు వినియోగించుకునేందుకు వీలుగా క్వాంటం వ్యాలీ సేవలు ఉండనున్నాయి.
2 వేల చదరపు అడుగుల్లో 133 క్యూబిట్, 5కే గేట్స్ క్యాంటం కంప్యూటర్ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది ఐబీఎం(IBM) సంస్థ. భద్రమైన నెట్వర్కింగ్, అధునాతన కూలింగ్ వ్యవస్థ, నిరంతర విద్యుత్ సరఫరాను క్వాంటం వ్యాలీకి అందించనుంది ఏపీ ప్రభుత్వం.
చదరపు అడుగుకు రూ.30కే అద్దె చెల్లించే ప్రాతిపదికన రాయితీపై ఐబీఎం సంస్థకు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి బదులుగా నాలుగేళ్ల పాటు ఏడాదికి 365 గంటల ఫ్రీ కంప్యూటింగ్ టైమ్ను ప్రభుత్వానికి కేటాయించనుంది ఐబీఎం సంస్థ. ప్రభుత్వ సంస్థలు, విద్య పరమైన అంశాలకుగానూ ఈ కంప్యూటింగ్ టైము కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
విట్ యూనివర్సిటీ క్యాంపస్లో రూ.6 కోట్ల వ్యయంతో మరో చిన్న క్వాంటం కంప్యూటర్ను ఏర్పాటు చేయనుంది బెంగుళూరుకు చెందిన స్టార్టప్ సంస్థ క్యూపై ఏఐ. ఈ మేరకు ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు.
అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ (AQCC) ఏమిటి?
A: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వ సంస్థ, ఇది క్వాంటం కంప్యూటింగ్ పరిశోధనలు, యూనివర్సిటీలు, స్టార్టప్లు, పరిశ్రమలు వినియోగించుకునేందుకు ఒక కేంద్రంగా పనిచేస్తుంది.
AQCC లో ఏ కంపెనీ క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు చేస్తోంది?
A: ఐబీఎం సంస్థ 133 క్యూబిట్, 5కే గేట్స్ క్వాంటం కంప్యూటర్ను ఏర్పాటు చేస్తోంది.
క్వాంటం వ్యాలీకి ఎంత భూమి కేటాయించారు?
A: సీఆర్డీఏ ఇప్పటికే 50 ఎకరాలను కేటాయించింది.
Read Hindi news: Hindi.vaartha.com
Read Also: